వివేకాను హత్య చేసింది ఆయనేనా..!?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో కలకం రేపిన మాజీ మంత్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. వివేకాకు అత్యంత సన్నిహితుడు పరమేశ్వరరెడ్డి పై అందరికీ అనుమానాలు వస్తున్నాయి. వివేకా హత్య జరిగిన రోజు నుంచి పరమేశ్వర్ కనిపించకుండా పోయారు. అయితే ఆయన హైబీపీతో కడప ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. పరమేశ్వర్ జాడకోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ మధ్యే వైసీపీ నుంచి వేరే పార్టీ మారేందుకు వివేక అత్యంత సన్నిహితుడు డీల్ కుదర్చుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వివేకా హత్యకు పరమేశ్వర్ భారీ డీల్ ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే సరిగ్గా ఈ ఘటన జరిగినప్పుడే ఆయన కనపకపోవడంతో అందరూ ఆయనే వివేకాను చంపాడని గుసగుసమంటున్నారు.
కీలక ఆధారాలు సేకరించాం..
కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ కీలక ఆధారాలు సేకరించామని వెల్లడించారు."రెండ్రోజుల పాటు అనేకమందిని విచారించాం. వివేకా డ్రైవర్, సహాయకుడు, మిగతావారిని విచారించాం. బెడ్రూం, బాత్రూమ్లో ఏం చేశారని ప్రశ్నించాం. వివేకాను ఆస్పత్రికి తరలించినప్పుడు ఎవరున్నారు. వివేకా హత్యలో అనేక ఆధారాలు లభించాయ్..
లేఖలో ఉన్న చేతిరాతను ఫోరెన్సిక్ పరీక్షకు పంపాం. మొదట రక్తం వాంతులతో చనిపోయారని మాకు చెప్పారు. అదే రకంగా కేసు నమోదు చేశాం" అని ఆయన మీడియాకు వివరించారు.
వివేకా సోదరుడు సంచలన వ్యాఖ్యలు
మరోవైపు వివేకా సోదరుడు వైఎస్ ప్రతాప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. "వివేకా హత్యకేసులో మాకు ఎలాంటి అనుమానాల్లేవ్.. సీబీఐ విచారణ కోరటం అనేది రాజకీయంగా చేసిన వ్యాఖ్యలు. రాజకీయంగా చాలా మంది మాట్లాడుతారు.. వాటితో మాకు సంబంధం లేదు. చిత్తూరులో మైనింగ్కు సంబంధించి వివేకా మా ఇంటిముందు ధర్నా చేసిన మాట వాస్తవమే.. హత్యకు మైనింగ్కు ఎలాంటి సంబంధం లేదు" అని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ హత్యకేసులో చిక్కుముడి ఎప్పుడు వీడుతుందో..? ఏంటో..? గానీ అరగంటకో ట్విస్ట్లు మాత్రం పెద్ద ఎత్తున పుట్టుకొస్తున్నాయి. అయితే ఈ కేసులో నిందితులెవరో..? ఎప్పుడు తేలుతుందో..? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.