నాగార్జున‌కు అంతా ముందే తెలుసా...

  • IndiaGlitz, [Saturday,July 20 2019]

నాగార్జున‌కు అంతా ముందే తెలుసా.. అత‌నికి ఆ విష‌యం ముందే ఉప్పందిందా? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు సినీ జ‌నాలు. ఇంత‌కీ ఇంత ఆశ్చ‌ర్యం ఎందుకంటే రిలీజ్ డేట్ విష‌యంలో. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున హీరోగా, ర‌కుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా తెర‌కెక్కుతోన్న 'మ‌న్మ‌థుడు2' విడుద‌ల విష‌యంలో. ఈ సినిమాను ఆగ‌స్ట్ 9న విడుద‌ల చేయ‌డానికి నాగ్ స‌న్నాహాలు చేశారు. 'సాహో' 15న విడుద‌ల చేస్తార‌నుకున్న నేప‌థ్యంలో మ‌న్మ‌థుడు2 పోస్ట్ పోన్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అప్ప‌ట్లో గుస‌గుస‌లు వినిపించాయి. వాట‌న్నిటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ నాగ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఆగ‌స్ట్ 9నే విడుద‌ల చేస్తున్న‌ట్టు క‌న్‌ఫ‌ర్మ్ చేశారు.

ఆయ‌న పోస్ట్ చేసిన కొన్నాళ్ల‌కు సాహో వాయిదా ప‌డింది. అంటే సాహో వీఎఫ్ ఎక్స్ ప‌నులు కొలిక్కి రాలేద‌ని, విడుద‌ల వాయిదా ప‌డుతుంద‌ని నాగార్జున‌కు ముందే ఉప్పందిన‌ట్టే. ఆ న‌మ్మ‌కంతోనే ఆయ‌న విడుద‌ల తేదీ విష‌యంలో ముందు నుంచీ స్ట్రాంగ్‌గా ఉన్న‌ట్టు స‌మాచారం. ఆల్రెడీ టీజ‌ర్‌లోనే మాస్ మ‌సాలా లిప్ లాక్‌లు చూపించేసిన నాగ్ ఈ సినిమాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోయి న‌టించార‌నీ టాక్ స్ప్రెడ్ అవుతుంది. దానికి త‌గ్గ‌ట్టు ర‌కుల్ కూడా ఇంత‌కు ముందు సినిమాల‌తో పోలిస్తే ఈ చిత్రంలో గ్లామ‌ర్ కోషెంట్ పెంచింద‌నే విష‌యం ఫొటోలు చూస్తేనే అర్థ‌మ‌వుతోంది. తొలి సినిమాతో స‌క్సెస్ బోణీ చేసిన రాహుల్, ఇప్పుడు ఈ చిత్రంతో ద్వితీయ విఘ్నాన్ని దాటేయాల‌ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట‌. సో అన్నీ క‌లిసొచ్చి మ‌న్మ‌థుడు2 హిట్ గ్యారంటీ అని నాగ్ స్ప‌ష్టంగా న‌మ్ముతున్నార‌ని స‌మాచారం.

More News

బిగ్‌బాస్-3 హౌస్‌లోకి ఊహించని కంటెస్టెంట్స్...!

తెలుగులో రెండు సీజన్లు విజయవంతం చేసుకున్న బిగ్‌బాస్ షో.. త్వరలో మూడో సీజన్‌ను ప్రారంభించబోతోంది.

అల్లు అర్జున్ - కో డైర‌క్ట‌ర్ స‌త్యం ఇష్యూ...

అస‌లేం జ‌రిగిందంటే..? అల్లు అర్జున్ సెట్లో యాటిట్యూడ్ చూపించారా?  దీనివ‌ల్ల కో డైర‌క్ట‌ర్ హ‌ర్ట్ అయ్యారా?

ఇస్మార్ట్ శంక‌ర్‌`తో హ్యాట్రిక్ డిస్ట్రిబ్యూట‌ర్‌గా  పేరు తెచ్చుకున్నందుకు ఆనందంగా ఉంది! - డిస్ట్రిబ్యూట‌ర్ `ఇస్మార్ట్` శ్రీను

పెద్ద మొత్తం డ‌బ్బుతో పాటు అద‌నంగా న‌మ్మ‌కాన్ని కూడా పెట్టుబ‌డిగా పెట్టి చేయాల్సిన వ్యాపారం డిస్ట్రిబ్యూష‌న్‌.

'ఎవ‌రు' టీజ‌ర్ విడుద‌ల

`క్ష‌ణం`, `అమీ తుమీ`, `గూఢ‌చారి` వంటి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న అడివిశేష్ క‌థానాయ‌కుడుగా రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ `ఎవ‌రు`.

'టీడీపీ ఓటమికి నారా లోకేషే కారణం.. జగన్‌, కేంద్రాన్ని కలుస్తా'

అవును మీరు వింటున్నది నిజమే.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. ఒకప్పుటి టీడీపీ కీలకనేత అన్నం సతీష్ ప్రభాకర్.