close
Choose your channels

రానా సినిమా డైరెక్ట‌ర్‌, కెమెరామెన్ మ‌ధ్య గొడ‌వ‌ ?

Wednesday, November 13, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రానా సినిమా డైరెక్ట‌ర్‌, కెమెరామెన్ మ‌ధ్య గొడ‌వ‌ ?

సాధార‌ణంగా సినిమా మేకింగ్‌లో స్టార్స్‌, టెక్నీషియ‌న్స్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డ‌మ‌నేది కామ‌న్‌గానే జ‌రుగుతుంటాయి. అయితే అవి అప్ప‌టి వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతూ ఉంటాయి. కానీ కొన్ని మాత్ర‌మే కంటిన్యూ అవుతాయి,. ర‌చ్చ‌కెక్కుతుంటాయి. ఇప్పుడు అలాంటి ఓ గొడ‌వ ర‌చ్చ‌కెక్కింద‌ట‌.

వివరాల్లోకెళ్తే రానా, సాయిప‌ల్ల‌వి హీరో హీరోయిన్లుగా `విరాట ప‌ర్వం` అనే సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా డైరెక్ట‌ర్ వేణు ఊడుగుల‌కు, కెమెరామెన్ దివాక‌ర్ మ‌ణికి పొస‌గ‌డం లేద‌ట‌. దివాక‌ర్ మ‌ణి మంచి టెక్నీషియ‌న్ అందులో కాద‌న‌లేని విష‌యం లేదు. అయితే ఎక్క‌డో డైరెక్ట‌ర్‌కి, ఈ కెమెరా మెన్‌కి తేడా కొట్టింది. దివాక‌ర్ మ‌ణి స్థానంలో వేణు ఊడుగుల త‌న‌కు న‌చ్చిన రాజ్ తోట‌ను కెమెరామెన్‌గా పెట్టుకోవాల‌నుకుంటున్నాడ‌ట‌. ఈ విష‌యం అటు..ఇటు చేరి రానాకు చేరింది. అయితే డిసెంబ‌ర్‌లో తాను సెట్స్‌లోకి వ‌స్తాన‌ని, అప్పటి వ‌ర‌కు స‌ర్దుకుని ఉండాలంటూ రానా వారిద్ద‌రికీ సూచించాడ‌ట‌.

మ‌రి సోష‌ల్ మీడియాలో విన‌ప‌డుతున్న ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. `నీదినాది ఒకే క‌థ‌` త‌ర్వాత వేణు ఊడుగుల తెర‌కెక్కిస్తున్న చిత్రమిది. 1992 బ్యాక్‌డ్రాప్‌లో పోలీస్‌, న‌క్స‌లైట్‌కు మ‌ధ్య సాగే ల‌వ్‌స్టోరీగా సినిమా తెర‌కెక్కుతుంది.

డి.సురేష్ బాబు, చెరుకూరి సుధాక‌ర్ ఈ చిత్నాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే సాయిప‌ల్ల‌విపై సోలో స‌న్నివేశాల‌ను చిత్ర యూనిట్ స‌భ్యులు చిత్రీక‌రించేశారు. రానాకు అనారోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌టంతో సినిమా మేకింగ్‌కు ఆల‌స్య‌మైంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.