మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌కు దిల్‌రాజు ప్లాన్‌..!

  • IndiaGlitz, [Tuesday,December 29 2020]

ప్ర‌స్తుతం తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోని స్టార్ ప్రొడ్యూస‌ర్స్‌లో దిల్‌రాజు ఒక‌రు. క‌థ‌ల‌పై న‌మ్మ‌కంతో చిన్న సినిమాలు, ఇమేజ్‌ను బేస్ చేసుకుని స్టార్ హీరోల సినిమాలు చేస్తూ దిల్‌రాజు త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు. క్రేజీ కాంబినేష‌న్స్‌ను సెట్ చేయ‌డంలోనూ దిల్‌రాజు ముందుంటారు. టాలీవుడ్‌లో ఆగిపోయిన మ‌ల్టీస్టారర్ సినిమాల‌కు విక్ట‌రీ వెంక‌టేశ్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌ల‌ను ఒప్పించి ‘సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు’ సినిమా చేసి హిట్ కొట్ట‌డ‌మే.. ఇద్ద‌రి హీరోల అభిమానుల‌ను కూడా మెప్పించేలా సినిమాను నిర్మించాడు దిల్‌రాజు. ఈ స్టార్ ప్రొడ్యూస‌ర్

ఇప్పుడు మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌కు ప్లాన్ చేశాడ‌ట‌. వివ‌రాల్లోకి వెళితే.. నేటి త‌రం అప్‌క‌మింగ్ హీరోల్లో విశ్వ‌క్‌సేన్‌, కార్తికేయ ఉంటారు. వీరిద్ద‌రినీ క‌లిపి దిల్‌రాజు ఓ సినిమాను నిర్మించ‌బోతున్నాడ‌ట‌. ఈ సినిమా ద్వారా ఓ ఎడిట‌ర్ ద‌ర్శ‌కుడిగా మారుతున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు.. విశ్వ‌క్ సేన్‌, కార్తికేయ‌ల్లో ఒక‌రు పాజిటివ్‌, మ‌రొక‌రు నెగ‌టివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌ల్లో కనిపిస్తార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

More News

2020.. చిత్ర పరిశ్రమకే బొమ్మ చూపించింది.. కానీ ఆయనకు మాత్రం..

2020.. మామూలుగా లేదుగా.. చిత్ర పరిశ్రమ అయితే ఇప్పటికీ కోలుకోలేదు. ఇండస్ట్రీ పరంగా బాక్సాఫీస్‌ను షేక్ ఆడించే సినిమాలతో

అవినాష్‌కి నాగ‌బాబు భారీ ఆఫ‌ర్‌..!

జ‌బ‌ర్‌ద‌స్త్ అవినాష్‌.. బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు పెద్ద‌గా అత‌నిపై ఎవ‌రికీ న‌మ్మ‌కం లేద‌నే చెప్పాలి.

భారీగా డిమాండ్ చేస్తున్న మోనాల్‌..?

ఐదు సినిమాల్లో న‌టించిన మోనాల్ గ‌జ్జ‌ర్‌కు ఇక సినిమాల్లో అవ‌కాశాలు రావు అని అనుకుంటున్న త‌రుణంలో బిగ్‌బాస్ 4 ఆమె రూట్‌ను మార్చేసింది.

వెంకటేశ్‌ - రానా మల్టీస్టారర్ డైరెక్టర్ ఫిక్స్ ?

దగ్గుబాటి హీరోలైన విక్టరీ వెంకటేశ్‌, రానా దగ్గుబాటి కలిసి ఓ సినిమా ఎప్పుడు చేస్తారా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఆత్మహత్య..

కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్, జేడీఎస్ ఎమ్మెల్సీ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకున్నారు.