దిల్‌రాజు, ప్ర‌భాస్ చిత్రం... డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

బాహుబ‌లి సినిమాతో నేష‌న‌ల్ రేంజ్ స్టార్‌డ‌మ్‌ను సంపాదించుకున్న యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌తో సినిమా చేయ‌డానికి ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్ర‌భాస్ మాత్రం నింపాదిగా సినిమాలు చేస్తూ వ‌స్తున్నాడు. 2011లో ప్ర‌భాస్ టాలీవుడ్‌కే ప‌రిమిత‌మై ఉన‌ప్పుడు హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో కె.ద‌శ‌ర‌థ్‌తో మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ సినిమాను రూపొందించారు. సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. దాదాపు తొమ్మిదేళ్లు అవుతున్నా.. ప్ర‌భాస్‌, దిల్‌రాజు కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాలేదు.

తాజా సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఇప్పుడు ప్ర‌భాస్‌తో సినిమాను నిర్మించ‌డానికి దిల్‌రాజు క‌థ‌ను సిద్ధం చేయిస్తున్నాడ‌ట‌. ఇంత‌కూ ద‌ర్శ‌కుడెవ‌రో తెలుసా? దిల్‌రాజు బ్యాన‌ర్‌లో ఎంసీఎతో హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్‌. ఈ ద‌ర్శ‌కుడికి దిల్‌రాజు ఇప్పుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను వ‌కీల్‌సాబ్‌లో డైరెక్ట్ చేసే అవ‌కాశం క‌ల్పించాడు. రీసెంట్‌గా వేణు శ్రీరామ్ చెప్పిన లైన్ న‌చ్చ‌డంతో దిల్‌రాజు పూర్తి క‌థ‌ను సిద్ధం చేయ‌మ‌ని చెప్పాడ‌ట‌. వ‌కీల్‌సాబ్‌పై ఓ క్లారిటీ వ‌చ్చిన త‌ర్వాత వేణు శ్రీరామ్ క‌థ‌ను త‌యారు చేసే ప‌నిలోకూర్చుంటాడ‌ట‌. అదే స‌మ‌యంలో ప్ర‌బాస్ త‌న 20వ సినిమాను, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో 21వ సినిమాను పూర్తి చేస్తాడు. ఆలోపు ప్ర‌భాస్‌ను క‌థ చెప్పించి ఒప్పించ‌గ‌లిగితే ప్ర‌భాస్‌, దిల్‌రాజు, శ్రీరామ్ వేణు కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంద‌ని టాక్ విన‌ప‌డుతుంది.

More News

శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా 'ఇట్స్ టైమ్ టు పార్టీ' ఫస్ట్ లుక్ విడుదల

బుల్లితెర రాములమ్మ, ప్రముఖ యాంకర్, 'బిగ్ బాస్ 3' ఫేమ్ శ్రీముఖి ముఖ్యమైన పాత్రలో నటించిన చిత్రం 'ఇట్స్ టైమ్ టు పార్టీ'. గౌతమ్ ఇ.వి.ఎస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

సినీ థియేటర్స్ ఓపెన్ చేస్తే ‘సీన్’ మారుతుంది!

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు.. థియేటర్స్ సర్వం బంద్ అయిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ 3.0లో చాలా సడలింపులు ఉన్నప్పటికీ థియేటర్స్‌ మాత్రం అందులో లేవ్.

గుడ్ న్యూస్ : ఈ నెల 12 నుంచి రైళ్లు నడుస్తాయ్..

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌తో ఎక్కడిక్కడ చిక్కుకున్న కార్మికులు, విద్యార్థులకు ఆదివారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ఒకింత శుభవార్తే చెప్పింది.

బాదుడే... బాదుడు.. జగన్ మార్క్ దోపిడీ: లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సెటైర్ల వర్షం కురిపించారు.

నేడు రెండో పెళ్లి చేసుకోనున్న నిర్మాత దిల్ రాజు

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. నేడు అనగా ఆదివారం రాత్రి ఈ వివాహం జరగనుంది. ఈ వేడుకకు నిజామాబాద్‌లోని వెంక‌టేశ్వర స్వామి దేవాలయం వేదిక కానుంది.