'ఆర్ఆర్ఆర్‌'పై పున‌రాలోచ‌న‌లో దిల్‌రాజు ?

  • IndiaGlitz, [Friday,April 03 2020]

బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’. ప్ర‌స్తుతం సినిమా 75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ఈ సినిమా బిజినెస్ దాదాపు అన్నీ ఏరియాల్లో పూర్త‌య్యింది. నైజాం హ‌క్కుల‌ను దిల్‌రాజు 75 కోట్ల రూపాయ‌ల‌తో పాటు జీఎస్టీని కూడా క‌డుతాన‌నే డీల్ మీద ద‌క్కించుకున్నాడు. అయితే ఇప్పుడు క‌రోనా ఎఫెక్ట్.. ఇప్ప‌ట్లో త‌గ్గేలా లేదు.

ఈ ఎఫెక్ట్ త‌గ్గ‌డానికి ఆరు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. దీంతో ఇలాంటి ప‌రిస్థితుల్లో మార్కెట్ పరిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని డీల్ గురించి ఆలోచించాల‌ని దిల్‌రాజు ఆలోచిస్తున్నాడ‌ట‌. అడ్వాన్స్‌ను ప‌క్క‌న పెడితే ఎన్ఐఏ డీల్ ప్ర‌కారం సినిమాను రిలీజ్ చేయ‌డం రిస్క్ అని దిల్‌రాజు భావిస్తున్నాడ‌ట‌. వేరే వాళ్లకు డీల్ ఇచ్చేస్తామ‌ని అంటే ప‌క్క‌కు పెట్టాడానికి కూడా దిల్‌రాజు సిద్ధ‌మేనంటున్నారు. త్వ‌ర‌లోనే నిర్మాత డి.వి.వి.దాన‌య్యతో దిల్‌రాజు ఈ విష‌యంపై చ‌ర్చ‌లు జ‌రిపే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

More News

ఎల్లుండి 9 నిమిషాలు నాకివ్వండి : మోదీ

కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా ఇప్పటికే జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఓ సారి పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా మరోసారి దేశ ప్రజలకు వెరైటీ పిలుపునిచ్చారు.

హాట్ స్టార్ తో క్రిష్ డీల్ ?

డైరెక్ట‌ర్ క్రిష్‌ను మ‌ల్టీ టాలెంటెడ్ అని చెప్పాలి. ఎందుకంటే ఓ ప‌క్క డైరెక్ష‌న్ చేస్తూనే నిర్మాణ బాధ్య‌త‌ల‌ను వ‌హిస్తుంటాడు. ఆయ‌న డైరెక్ట్ చేసిన సినిమాల‌న్నింటిలోనూ

మ‌హేశ్ 27లో నిర్మాణం స‌రే.. లాభాలెవరికి ?

సూప‌ర్‌స్టార్ మహేశ్ 27వ సినిమా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుందనే వార్త‌లు విన‌ప‌డుత‌న్నాయి. మ‌హేశ్ నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌తో పాటు మైత్రీ మూవీ మేక‌ర్స్‌

రెండక్ష‌రాల టైటిల్‌తో బ‌న్నీ...?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల‌లో షూటింగ్ ప్రారంభం కావాల్సింది. అయితే కాలేదు.

మెగాస్టార్ చిరు ఇల్లు ఎలా ఉందో చూడండి!?

కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా యావత్ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తోంది. ఈ క్రమంలో సినిమా షూటింగ్‌లు, రిలీజ్‌లు సర్వం బంద్ చేసుకున్నారు. దీంతో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు