close
Choose your channels

అల్లరి నరేష్ మూవీ రీమేక్.. చేతులు కలిపిన దిల్ రాజు, అజయ్ దేవ్‌గణ్‌

Friday, June 25, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అల్లరి నరేష్ మూవీ రీమేక్.. చేతులు కలిపిన దిల్ రాజు, అజయ్ దేవ్‌గణ్‌

ఇటీవల స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆసక్తికరమైన కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు. తాజాగా ఆయన హిందీ మార్కెట్ పై కన్నేశారు. అల్లరి నరేష్ నటించిన 'నాంది' చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. కోర్టు సన్నివేశాలు, నటన, ఎమోషన్స్ ప్రధాన బలంగా తెరకెక్కిన ఈ చిత్రం అందరిని మెప్పించింది.

నాంది చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు దిల్ రాజు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్‌ తో చేతులు కలిపారు. ఈ ఆసక్తికర కాంబినేషన్ పై అజయ్ స్పందించారు. 'నాంది చాలా కీలకమైన చిత్రం. మన ప్రభుత్వ విధానాల్లో ఉన్న లూప్ హొల్స్ ని బయట పెట్టే చిత్రం ఇది. తెలుగు వర్షన్ ప్రభావవంతంగా, రా పెర్ఫామెన్స్ తో ఉంది.

ఈ చిత్రాన్ని ఎక్కువ ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా నేను, దిల్ రాజు చేతులు కలిపాం. నాంది మూవీని మా నిర్మాణంలో హిందీలో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాం. మేము ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం. స్క్రిప్ట్ ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయాల్సి ఉంది.

నటీనటుల ఎంపిక తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తాం అని అజయ్ అన్నారు. దిల్ రాజు, అజయ్ తో పాటు పరాగ్ దేశాయ్, కులదీప్ రాథోర్ ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించనున్నారు.

అల్లరి నరేష్ లోని నటుడుని మరో స్థాయికి చేర్చిన చిత్రం నాంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించింది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సతీష్ వేగేశ్న నిర్మించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos