అమెరికాలో దిల్ రాజు దంపతుల ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ

  • IndiaGlitz, [Monday,May 10 2021]

నిర్మాత దిల్ రాజు, వైఘా రెడ్డిని గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో నిజామాబాద్ జిల్లాలోని ఓ గుడిలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వారి వివాహం జరిగి నేటికి ఏడాది అవుతోంది. వీరు తమ మొదటి వెడ్డింగ్ యానివర్సరీని వైభవంగా చేసుకోవాలని గతంలో నిర్ణయించుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేసులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. తమ తొలి వెడ్డింగ్ యానివర్సరీని నేపథ్యంలో దిల్ రాజు ఆయన భార్య ఇప్పటికే అమెరికా వెళ్లిపోయారు. ప్రస్తుతం దిల్ రాజు దంపతులు అమెరికాలో ఉన్నారు.

Also Read: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కరోనా

కాగా.. దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో మరణించిన విషయం తెలిసిందే. 10 మే 2020లో ఆయన వైఘా రెడ్డిని రెండో వివాహం చేసుకున్నారు. దిల్ రాజు కుమార్తె అన్షితా రెడ్డి ఆయన రెండో వివాహానికి పూర్తిగా సహకరించారు. 50 ఏళ్ల దిల్ రాజు ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ పెద్ద సినిమాను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

More News

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కరోనా

కరోనా ఫస్ట్ వేవ్‌లో పెద్దగా సెలబ్రిటీలెవరూ కరోనా బారిన పడలేదు కానీ సెకండ్ వేవ్‌లో మాత్రం స్టార్ హీరోలంతా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.

ఈటల, కొండా కలిసి కేసీఆర్ సీటుకు ఎసరు పెడతారా?

ఇటీవల మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భేటీ అయ్యారు. ఆ భేటీలో ఏం జరిగిందో ఏమో కానీ కొండా మాత్రం స్పీడ్ పెంచేశారు.

కరోనా సంర‌క్ష‌ణా కేంద్రానికి అమితాబ్ భారీ విరాళం

భారత్‌ను కొవిడ్ సెకండ్ వేవ్ అల్లకల్లోలం చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా సామాన్యులు, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలన్న తేడా లేకుండా అంతా కరోనా బారిన పడుతున్నారు.

'పంచతంత్రం'లో విహారిగా నరేష్ అగస్త్య... అతని పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల

బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం 'పంచతంత్రం'.

కొవిడ్ బాధితులకు ‘రాధేశ్యామ్’ నిర్మాతల సాయం

కొవిడ్ సెకండ్ వేవ్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా తెలుగు రాష్ట్రాలు అల్లాడుతున్నాయి.