అన్న‌య్య స్థానాన్ని త‌మ్ముడు భ‌ర్తీ చేస్తాడా?

అన్నీ అనుకున్న‌ట్లు సాగుంటే మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య ఆగ‌స్ట్ 14న విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావించారు. అయితే క‌రోనా వైర‌స్ మ‌న హీరోల ఆలోచ‌న‌ల‌కు గండి కొట్టింది. దీంతో ఆచార్య విడుద‌ల వెన‌క్కి వెళ్లిన‌ట్లేన‌ని టాలీవుడ్ వ‌ర్గాలు అనుకుంటున్నాయి. అదే త‌రుణంలో అన్న‌య్య రాలేక‌పోతున్న విడుద‌ల తేదీని ప‌వ‌ర్‌స్టార్‌ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌కీల్‌సాబ్‌తో ఫిలి చేస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

నిజానికి వ‌కీల్‌సాబ్‌ను మే 15న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు దిల్‌రాజు, బోనీ క‌పూర్ భావించారు. అయితే క‌రోనా ఎఫెక్ట్‌తో సినిమా షూటింగ్ ఆగింది. దీంతో విడుద‌ల తేదీని మార్చుకోవాల్సిన ప‌రిస్థితి క‌న‌ప‌డుతుంది. ఏరోజున విడుద‌ల చేయాల‌ని నిర్మాలు ఆలోచించుకున్నారు. ముందుగా జూలైలో విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే క‌రోనా ప్ర‌భావంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్స్‌కు రావ‌డానికి స‌మ‌యం ప‌ట్టేలాగానే క‌న‌ప‌డుతుంది. దీంతో వ‌కీల్‌సాబ్‌ను ఆగ‌స్ట్ 14న విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌. బాలీవుడ్ చిత్రం పింక్‌కు రీమేకే వ‌కీల్‌సాబ్‌. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంతో పాటు ప‌వ‌న్ మ‌రో చిత్రాన్ని క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సంగ‌తి తెలిసిందే.