ఆది సాయికుమార్ కొత్త సినిమా టైటిల్ లాంఛ్ చేసిన డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి

  • IndiaGlitz, [Friday,December 17 2021]

చాగంటి ప్రొడ‌క్ష‌న్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సినిమా టైటిల్ సి.ఎస్.ఐ. స‌నాత‌న్ ని లాంఛ్ చేసారు సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి. క్రైమా్ సీన్ ఇన్వ‌స్టిగేష‌న్ (సియ‌స్ ఐ) ఆఫీస‌ర్ గా ఆదిసాయికుమార్ ఒక కొత్త రోల్ లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఒక పెద్ద షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ ఈ నెల 27న ప్రారంభ‌మ‌వుతుంద‌ని చిత్ర నిర్మాత అజ‌య్ శ్రీనివాస్ అన్నారు.

ఆది సాయికుమార్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా టైటిల్ లాంఛ్ చేసిన ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి కాన్సెప్ట్ ని తెలుసుకొని టీం ని అభినందించారు. కాన్సెప్ట్ ని ఎలివేట్ చేసే మోష‌న్ పోస్ట‌ర్ తో అద్భుత‌మైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో రూపొందించిన మోష‌న్ పోస్ట‌ర్ చాలా ఇప్రెసివ్ గా ఉంది. తార‌క్ పోన్న‌ప్ప‌, నందిని రాయ్, అలీ రాజా, వ‌సంతి , మ‌ధు సూద‌న్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ కథతో శివ‌శంక‌ర్ దేవ్ దర్శకుడి గా పరిచయం అవుతున్నారు.

ఈ సంద‌ర్భంగా..

ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి మాట్లాడుతూః కాన్సెప్ట్ చాలా బాగుంది. హీరో ఆది సాయికుమార్ చాలా ప్రెష్ గా అనిపించారు. క్రైమ్ థ్రిల‌ర్స్ ని గ్రిప్పింగ్ గా చెప్ప‌గ‌లిగితే త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు. ద‌ర్శ‌కుడు శివ‌శంక‌ర్ దేవ్, నిర్మాత అజ‌య్ శ్రీనివాస్ ల‌కు ఆల్ ద బెస్ట్ . అన్నారు..

నిర్మాత అజ‌య్ శ్రీనివాస్ మాట్లాడుతూః రెండ్రోజుల క్రిత‌మే ఒక లాంగ్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసాము. మ‌రో షెడ్యూల్ ఈ నెల 27 న మొద‌ల‌వుతుంది. ఈ షెడ్యూల్ లో సినిమా కంప్లీట్ చేస్తాము. ఆది సాయికుమార్ ఇప్ప‌టి వ‌ర‌కూ చేయ‌ని పాత్ర‌లో క‌నిపిస్తారు. స‌నాత‌న్ గా ఆయ‌న న‌ట‌న చాలా ప్ర‌త్యేకంగా ఉంటుంది. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాము . అన్నారు..

న‌టీ న‌టులు - ఆదిసాయికుమార్, మిషా నారంగ్, అలీ రాజా, నందిని రాయ్, తాక‌ర్ పొన్న‌ప్ప ,మ‌ధు సూద‌న్, వసంతి తదితరులు

More News

విజయ్ ఆంటోనీ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఎమోషన్ థ్రిల్లర్‌  "విక్రమ్ రాథోడ్"

విజయ్ ఆంటోనీ... తమిళ సినిమాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో.

బిగ్‌బాస్ 5 తెలుగు: సిరిని వెనకనుంచి వాటేసుకున్న షన్నూ.. ఇంత ఓవరాక్టింగ్‌ బ్యాచ్‌ ఏంట్రా అంటూ సన్నీ

బిగ్‌బాస్ 5 తెలుగు ముగింపు దశకు వచ్చింది. ఇప్పటికే కంటెస్టెంట్స్‌ జర్నీలు పూర్తవ్వగా... ఫైనల్‌లో ఎలాగైనా గెలవాలని ఎవరి ప్లాన్లు వారు వేసుకుంటున్నారు.

భీమ్లా నాయక్ : వికారాబాద్‌లో కొత్త షెడ్యూల్.. పవన్‌ను చూసేందుకు ఎగబడ్డ జనం

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లానాయక్‌’.

త్రివిక్రమ్ భార్య సౌజన్య నృత్య ప్రదర్శన.. చీఫ్ గెస్ట్‌గా పవన్ కళ్యాణ్

వెండితెరపై రాణిస్తున్న పలువురు నటీనటులు, టెక్నీషీయన్ల జీవిత భాగస్వాములు పలు రంగాల్లో నిష్ణాతులు.

చిత్ర సీమలో మళ్లీ ‘‘కరోనా’’ టెన్షన్...  విక్రమ్‌కు కోవిడ్ పాజిటివ్

భారత్‌లో కరోనా వైరస్ ఎంతోమంది ప్రముఖులను బలి తీసుకుంది. వీరిలో సినీతారలు కూడా వున్నారు.