పెళ్లి ఫిక్సైన ప్రొడ్యూస‌ర్ కూతురు - డైరెక్ట‌ర్ జంప్..

  • IndiaGlitz, [Thursday,April 14 2016]

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఇటీవ‌ల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై... తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సాధించిన యువ ద‌ర్శ‌కుడు, పెళ్లి ఫిక్స్ అయిన ప్రొడ్యూస‌ర్ కూతురు క‌లిసి పారిపోయారు. ఇంత‌కీ ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రు..? ఆ నిర్మాత కూతురు ఎవ‌రు..? అని ఆలోచిస్తున్నారా..? సుధీర్ బాబు హీరోగా భ‌లే మంచిరోజు చిత్రాన్ని తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్య‌. అవును..ఇది నిజంగా నిజం. ఇక ఆ నిర్మాత కూతురు ఎవ‌ర‌నేది తెలియ‌లేదు. కాక‌పోతే ఆ నిర్మాత తెలుగు ఇండ‌స్ట్రీలో అగ్ర‌హీరోతో సినిమాలు నిర్మించార‌ని స‌మాచారం. శ్రీరామ్ ఆదిత్య‌, నిర్మాత కుమార్తె గ‌త కొంత‌కాలంగా ప్రేమించుకుంటున్నార‌ట‌. అయితే పెద్ద‌లు మాత్రం వీరి పెళ్లికి అంగీక‌రించ‌లేద‌ట‌.

వీరి ప్రేమ వ్య‌వ‌హారం తెలిసి అమ్మాయికి ఈనెల 17న వేరే వ్య‌క్తితో వివాహాం చేసేందుకు నిర్ణ‌యించార‌ట‌. పెళ్లి శుభ‌లేఖ‌లు అంద‌రికీ పంచ‌డం..పెళ్లికి వ‌చ్చే అతిధులు కోసం హాట‌ల్లో రూమ్స్ బుక్ చేయ‌డం కూడా జ‌రిగింద‌ట‌. ఇంత‌లో అమ్మాయి ఇంట్లో క‌నిపించ‌డం లేద‌ట‌. ఎక్క‌డ‌కి వెళ్లింద‌ని ఆరా తీస్తే...శ్రీరామ్ ఆదిత్య తో క‌ల‌సి వెళ్లిపోయింద‌ని తెలిసింద‌ట‌. అయితే పోలీస్ స్టేష‌న్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తే ప‌రువు పోతుంద‌నే ఉద్దేశ్యంతో కంప్లైట్ చేయ‌లేద‌ని స‌మాచారం. కూతురు ఇచ్చిన షాక్ తో ఆ త‌ల్లిదండ్రులు ఇంకా తేరుకోలేద‌ట‌. భ‌లే మంచిరోజు సినిమాతో స‌క్సెస్ సాధించిన శ్రీరామ్ ఆదిత్య త‌దుప‌రి చిత్రాన్ని నానితో చేయ‌నున్నారు.ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏమిటంటే... భ‌లే మంచిరోజు సినిమాలో హీరోయిన్ త‌న‌కు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నార‌ని ఇంట్లోంచి పారిపోతుంది. త‌న ప్రియుడు శ్రీరామ్ ఆదిత్య తెర‌కెక్కించిన సినిమాలోని ఈ స‌న్నివేశం చూసి స్పూర్తి పొందిందేమో ఆ అమ్మాయి అలానే చేయ‌డం విశేషం.

More News

చైతు - అఖిల్ సినిమాల‌పై మ‌న‌సు పెట్ట‌లేద‌న్న నాగ్..

టాలీవుడ్ కింగ్ నాగార్జున మ‌నం, సోగ్గాడే చిన్నినాయ‌నా, ఊపిరి చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించి స‌రికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు.

హీరో విష్ణు కి కోపం వ‌చ్చింది..

మంచు విష్ణు - రాజ్ త‌రుణ్ కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం ఈడోర‌కం - ఆడోర‌కం. జి.నాగేశ్వ‌ర‌రెడ్డి తెర‌కెక్కించిన ఈడోర‌కం - ఆడోర‌కం చిత్రం ఈరోజు రిలీజైంది.

మనోభావాలను గౌరవించి విజయ్ పోలీసోడు టైటిల్ మార్పు

ఇళయతలపతి విజయ్ నటించిన "తెరి" చిత్రానికి  తెలుగు లో "పోలీసోడు" అనే టైటిల్ ను అనుకున్న విషయం తెలిసిందే. తేరి చిత్రానికి పోలీసోడు అనే టైటిల్ ను పెడితే బాగుంటుంది అని నిర్ణయించింది నిర్మాత  కలయిపులి ఎస్ థాను. దిల్ రాజు గారు ఈ చిత్రాన్ని తెలుగు లో కేవలం విడుదల మాత్రమే చేస్తున్నారు.

మ‌హేష్ ఫ్యాన్స్ ని టెన్ష‌న్ పెడుతున్న సెంటిమెంట్..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు, త‌మిళ్ లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణీత న‌టిస్తున్నారు.

పోలీసోడు ర‌న్ టైమ్..

త‌మిళ హీరో విజ‌య్ న‌టించిన తెరి చిత్రం తెలుగులో పోలీసోడు టైటిల్ తో రిలీజ్ అవుతుంది. విజ‌య్ స‌ర‌స‌న స‌మంత‌, అమీ జాక్స‌న్ న‌టించారు. అట్లీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.