మ్యూజిక్ డైరెక్టర్ కోటి చేతుల మీదుగా ‘కళాపోషకులు’ చిత్రం నుండి నువ్వేలే నువ్వేలే సాంగ్ విడుదల!

  • IndiaGlitz, [Monday,October 26 2020]

విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరోహీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై చలపతి పువ్వల ద‌ర్శ‌క‌త్వంలో ఏమ్. సుధాకర్ రెడ్డి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం ‘కళాపోషకులు’. న‌టుడు జెమిని సురేష్ ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఈ చిత్రంలోని నువ్విలా... నువ్విలా అంటూ సాగే పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి విడుదల చేశారు.

ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు చలపతి పువ్వల మాట్లాడుతూ .. కళాపోషకులు మూవీ నుండి చిత్ర, విజయ్ ప్రకాష్ గారు అద్భుతంగా పాడిన నువ్వేలే... నువ్వేలే.. పాటను సుస్వరాల కిరీటి కోటి గారు విడుదల చెయ్యడంతో ఆనందంగా ఉంది. న‌న్ను నమ్మి ఈ అవ‌కాశం ఇచ్చిన మా నిర్మాత సుధాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. సుధాకర్ రెడ్డి గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను నిర్మించ‌డం వ‌ల్లే ఔట్‌పుట్ ఇంత‌బాగా వ‌చ్చింది. ఆ నలుగురు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విశ్వకార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. మొద‌టి సినిమా అయినా చాలా బాగా న‌టించారు. లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. ఇటీవల విడుదలైన మా సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించిందని అన్నారు.

నిర్మాత ఏమ్. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ... టీజర్ బాగుందని అందరూ అంటున్నారు. ఈ క‌థకి హీరోగా విశ్వకార్తికేయ ప‌ర్‌ఫెక్ట్ చాయిస్‌. దర్శకుడు చలపతి పువ్వల ఈ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. కల్యాణ్ సమి కెమెరా వర్క్, ఎలెందర్ మహావీర్ మ్యూజిక్ సినిమాకు అదనవు ఆకర్షణలు కానున్నాయి. ఈ సినిమా త‌ప్ప‌కుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించే విధంగా ఉండబోతోంది. మీ అంద‌రి స‌పోర్ట్ కావాలి అన్నారు.

హీరో విశ్వకార్తికేయ మాట్లాడుతూ - ''ఈ మూవీ ఒక టీమ్ వ‌ర్క్‌, ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ సపోర్ట్‌తోనే మంచి ఔట్‌పుట్ సాధ్యం అయింది. నిర్మాత ఏమ్. సుధాకర్ రెడ్డి గారు ముందుండి మాకు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూసుకున్నారు. చ‌ల‌ప‌తి గారు ఈ క‌థ న‌రేట్ చేస్తున్న‌ప్పుడే బాగా న‌చ్చి ఈ సినిమా చేయ‌డం జ‌రిగింది. మేమంద‌రం ఎంతో ఇష్టంగా క‌ష్ట‌ప‌డి చేసిన 'క‌ళాపోష‌కులు' చిత్రానికి మీ అంద‌రి ఆశిర్వాదాలు ఉండాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

More News

దసరా పండగ సందర్భంగా పూజా కార్యక్రమాలతొ ప్రారంభమైన`వాళ్ళిద్ద‌రు`!

ర‌మేష్ ఆర్యన్, అర్జున్ మహి(`ఇష్టంగా` ఫేమ్‌), డాలి చావ్లా, మీన‌ల్ మీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతోన్న చిత్రం `వాళ్ళిద్ద‌రు`.

బేబీ లాలిత్య సమర్పణలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ లో కొత్త చిత్రం ప్రారంభం!

బేబీ లాలిత్య సమర్పణలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి.ఎమ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న నూతన చిత్రం దసరా సందర్భంగా

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉన్న 'ఏమైపోయావే'

శ్రీరామ్ క్రియేషన్స్, వీఎం  స్టూడియోస్ పతాకాలపై మురళి దర్శకత్వంలో రాజీవ్ సిద్ధార్థ్, భవాని చౌదరి, శాను మజ్జారి హీరోహీరోయిన్లుగా

డిఫ‌రెంట్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ `మాయ‌` టీజర్ ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు మారుతి!

ప్రవాస భారతీయురాలైన రాధికా జయంతి దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం `మాయ`. సంధ్య బయిరెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ పోషించ‌గా,

విజయదశమి కానుకగా పేదలకు సొంతింటి కల సాకారం: కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం విజయదశమి కానుకగా పేదలకు సొంతింటి కలను సాకారం చేసిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.