దాన్ని టచ్ చేయనన్న డైరక్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
టచ్చేంటి? దాన్ని అంటే దేన్ని? ఆ డైరక్టర్ ఎవరు? తొందరగా సమాధానం చెప్పండి. మా పాటికి మేం మాడిపోయిన మసాలా దోస తింటుంటే కనిపించీ కనిపించనట్టు, చూపించీ చూపించనట్టు జ్యోతిలక్ష్మిలాగా ఆ హెడ్డింగేంటి? అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఆ డైరక్టర్ పేరు స్వరూప్. ఆయన తీసిన సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగ ఆయన హైదరాబాద్లో ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు.
``నాకు చిరంజీవిగారు నటించిన `చంటబ్బాయి` అంటే చాలా ఇష్టం. ఆ సినిమా నా దృష్టిలో గొప్ప క్లాసిక్. అందుకే ఆ సినిమాను టచ్ చేయలేదు. కాకపోతే ఆ జోనర్లో మా సినిమా ఉంటుంది. చంటబ్బాయిలోలాగా మా సినిమాలోనూ కామెడీ టింజ్ ఉంటుంది. నా బలం కూడా కామెడీనే. దానికి తోడు థ్రిల్లింగ్ కలిగించే అంశాలు కూడా జోడిస్తాను`` అని అన్నారు. స్వరూప్ సొంత ఊరు నెల్లూరట. ఆయనకు ఆత్రేయ ఇష్టమట. అందుకే తన సినిమా పేరులో ఆత్రేయను కూడా చేర్చుకున్నారు. నవీన్ ఇందులో కథానాయకుడు. `మళ్లీరావా`లాంటి చిత్రాన్ని తీసిన అభిరుచిగల నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాకు నిర్మాత.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.