33 ఏళ్ల సినీ ప్రస్థానంలో దర్శకుడు శ్రీనివాస రెడ్డి

  • IndiaGlitz, [Thursday,June 29 2017]

కామెడీ చిత్రాల దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ దర్శకుడు ఎస్. శ్రీనివాస రెడ్డి 33 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని శ్రీ క్రిష్ణా మూవీ మేకర్స్ ఆఫీస్ లో వేడుకలు జరుపుకున్నారు.

1984లో ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు విజ‌యారెడ్డి ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా సినీ రంగ ప్ర‌వేశం చేశారు. ఆ త‌రువాత‌, అంకుశం చిత్రానికి ప‌నిచేశారు. వై. నాగేశ్వ‌ర‌రావు, శివ నాగేశ్వ‌ర‌రావు వంటి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుల ద‌గ్గ‌ర చాలా చిత్రాల‌కు ప‌నిచేశారు.

కుటుంబ సమేతంగా థియేటర్ కు వెళ్లి చూడదగ్గర కామెడీ సినిమాలు అంటే అందరికీ గుర్తొచ్చే దర్శకుడు శ్రీనివాస రెడ్డి. ఆయన సినిమా టైటిల్స్ ఎంపిక దగ్గర నుంచే కామెడీ టచ్ ఉండేలా చూసుకుంటారు. అదిరిందయ్యా చంద్రం చిత్రంతో సూపర్ హిట్ అందుకుని.. ఆ తరువాత, టాటా బిర్లా మధ్యలో లైలా, బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్, కుబేరులు వంటి కామెడీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. యమగోల మళ్లీ మొదలైంది చిత్రంతో సోషియో ఫ్యాంటసీ సబ్జెక్టుల్ని కూడా అద్భుతంగా డీల్ చెయ్యగలరని నిరూపించుకున్నారు. తక్కువ బడ్జెట్ లోనే... స్పెషల్ ఎఫెక్ట్స్ మేళవించి తీసిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం.

ఆ తరువాత, నాగార్జున హీరోగా తెరకెక్కించిన ఢమరుకం చిత్రం.. అప్పటి వరకూ నాగ్ కెరీర్లోనే టాప్ గ్రాసర్ గా నిలిచింది. తెలుగులో గంటకు పైగా విజువల్ ఎఫెక్ట్స్ తో ఓ సినిమా చేయడం అదే ప్రథమం.

More News

పృథ్వీకి కోర్టులో చుక్కెదురు...

థర్టీ ఇయర్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ చిన్న చిన్న వేషాలు వేసిన కమెడియన్ పృథ్వీ ఇప్పుడు వన్ ఆఫ్ ది లీడింగ్ కమెడియన్గా మారారు. వ్యక్తిగత విషయానికి వస్తే పృథ్వీ తన భార్య శ్రీలక్ష్మితో వచ్చిన విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నాడు.

ఒకపాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకొన్న మంచు విష్ణు 'ఓటర్'

మంచు విష్ణు-సురభి జంటగా జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు-తమిళ బైలింగువల్ "ఓటర్". "హీరో ఆఫ్ ది నేషన్" అనేది ట్యాగ్ లైన్. రామా రీల్స్ పతాకంపై సుధీర్ కుమార్ పూదోట (జాన్) నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న 'రెండు రెళ్ళు ఆరు'

అనిల్ మల్లెల, మహిమా హీరోహీరోయిన్లుగా నందు మల్లెల దర్శకత్వంలో సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం, డే డ్రీమ్స్ బ్యానర్స్ పతాకంపై ప్రదీప్చంద్ర, మోహన్ అండె సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'రెండు రెళ్ళు ఆరు'.

గల్ఫ్ కథానాయకుని ప్రచార చిత్రం ఆవిష్కరించిన నేచురల్ స్టార్ నాని

శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో చేతన్ మద్దినేని హీరోగా,

కాంటెంపరరీ జర్నలిస్ట్ పాత్రలో శ్రద్ధాదాస్

హీరోయిన్ శ్రద్ధాదాస్ ఇప్పుడు 'పిఎస్ వి గరుడవేగ 126.18ఎం' చిత్రంలో జర్నలిస్ట్ పాత్ర చేస్తుంది.