close
Choose your channels

ఏపీలో వీడిన సస్పెన్స్.. కరోనాను కంట్రోల్ చేసిన డాక్టర్‌కు మంత్రి పదవి!

Wednesday, July 15, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో సస్పెన్స్ వీడింది. ఇద్దరు మంత్రులు రాజ్యసభకు ఎన్నిక కావడంతో వారి ప్లేస్‌ను ఏపీ సీఎం జగన్ ఎవరితో భర్తీ చేస్తారా? అనేది ఇన్ని రోజులుగా సస్పెన్స్‌లో ఉండి పోయింది. తాజాగా ఆ సస్పెన్స్‌కు తెరపడింది. ఖాళీ అయిన మంత్రుల స్థానాలను అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులతో జగన్ భర్తీ చేయనున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఒకరికి కరోనా కారణంగా మంత్రి పదవి లభిస్తుండటం గమనార్హం. లాభ, నష్టాల బేరీజు వేసుకుంటే కరోనా ఎంత నష్టాన్ని కలిగించిందో అంతే ప్రయోజనం కూడా కలిగించిందనేది నిపుణులు చెబుతున్న మాట. ఎవరికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చిందనే అంశాలను పక్కన బెడితే ఒకరికి మాత్రం మంత్రి పదవిని కట్టబెట్టబోతోంది.

అసలు విషయంలోకి వెళితే.. ఇటీవల మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోసులు రాజ్యసభకు ఎన్నికవడంతో వారి మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. ఆ రెండు పదవులకు కొత్తవారి పేర్లు ఖరారైనట్టు తెలుస్తోంది. రెండు మంత్రి పదవుల్లో మోపిదేవి స్థానాన్ని.. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజుతో.. సుభాష్ చంద్రబోస్ స్థానాన్ని రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణతో భర్తీ చేయనున్నట్టు సమాచారం. అప్పలరాజు స్వతహాగా వైద్యుడు. ఇటీవల కరోనా విషయంలో అప్పలరాజు స్థానికంగా తీసుకున్న చర్యలు జగన్‌ను ఆకర్షించాయి. దీంతో ఆయనను కేబినెట్‌లోకి తీసుకుని వైద్య ఆరోగ్యశాఖను అప్పగించనున్నారని టాక్. ఆయన కలిసొచ్చిన మరో అంశం.. మోపిదేవి మత్స్యకార సామాజికవర్గానికి చెందినవారు కాగా.. అప్పలరాజు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం.

ఇక పిల్లి సుభాష్ చంద్రబోస్.. శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు.. వేణు గోపాలకృష్ణ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో మంత్రి పదవికి లైన్ క్టియర్ అయింది. ఇకపోతే ప్రస్తుతం ఏపీలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. అందులో సుభాష్ చంద్రబోస్ వల్ల ఖాళీ అయిన స్థానానికి 9నెలలు మాత్రమే గడువు ఉంది. అందువల్ల ఆ స్థానానికి ఎన్నిక జరగదు. మోపిదేవి వెంకట రమణ ఎమ్మెల్సీ స్థానాన్ని మర్రి రాజశేఖర్‌కు ఇస్తున్నారు. గవర్నర్ కోటాలో రెండు స్థానాలను కడప జిల్లా రాయచోటికి చెందిన జకియా సుల్తానా అనే మహిళకు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషిన్ రాజుకు కేటాయించబోతున్నారని సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.