రాజ‌మౌళి కుటుంబానికి సినీ కార్మికుల గోడు ప‌ట్ట‌దా?

ప్ర‌పంచ‌మంతా క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) ప్ర‌భావంతో విల‌విల‌లాడుతోంది. సినీ రంగం విష‌యానికి వ‌స్తే.. షూటింగ్స్ ఆగిపోయాయి. దీని వ‌ల్ల స్టార్స్‌కు వ‌చ్చిన స‌మ‌స్య‌లేమీ లేవు. వ‌చ్చిన స‌మ‌స్య‌లంతా రోజువారీ కార్మికుల‌కే. షూటింగ్స్‌పైనే ఆధార‌ప‌డి బ్ర‌తికే వారి కుటుంబాలు ఆక‌లితో, ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో చిరంజీవి అధ్య‌క్ష‌త‌న ‘సీసీసీ మ‌న‌కోసం’ అనే సంస్థ‌ను ఏర్పాటు చేశారు సినీ పెద్ద‌లు. మెగా హీరోలే కాదు.. ఎంటైర్ సినిమా ప‌రిశ్ర‌మ‌లో ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు కూడా ఈ సంస్థ‌కు త‌మ వంతుగా విరాళాల‌ను అంద‌చేస్తున్నారు. అయితే అస‌లు త‌మ‌కేం ప‌ట్ట‌నట్లు ఉన్నది మాత్రం రాజ‌మౌళి అండ్ ఫ్యామిలీ.

బాహుబ‌లి వంటి గొప్ప సినిమాను తీసిన ద‌ర్శ‌కుడు రాజమౌళి ఇప్పుడు మరో భారీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. చిన్న స్థాయి నుండి ఈ స్థాయికి ఎదిగిన ఈ దర్శకుడు.. ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్ట‌ర్‌. ఆయ‌న‌తో సినిమా చేయాల‌ని హీరోలే కాదు.. నిర్మాత‌లు కూడా ఊవ్విళ్లూరుతుంటారు. ప్రతి సినిమా కోసం భారీ మొత్తంలో ఫ్యామిలీ ప్యాకేజీలు తీసుకుని రాజ‌మౌళి అండ్ ఫ్యామిలీ సినిమాలు చేస్తార‌ని ఇండ‌స్ట్రీలో లుక‌లుక‌లు విన‌ప‌డుతుంటాయి. అంత భారీ మొత్తంలో ప్యాకేజీలు అందుకునే వారికి కార్మికుల క‌ష్టం క‌న‌ప‌డ‌టం లేదా? అనే ప్ర‌శ్న అంద‌రి మ‌దిని తొలుస్తుంది. క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఇబ్బంది ప‌డుతున్న కార్మికుల‌కు కాస్తో కూస్తో విరాళ‌మిచ్చేంత మ‌న‌సు రాజ‌మౌళి అండ్ ఫ్యామిలీకి లేదా? అస‌లు గుర్తుకు రాదా? అని గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

ప్రభాస్ కోసం ఆసుపత్రి కట్టేస్తున్నారట...

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, జిల్ ఫేమ్ రాధాకృష్ణ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. యువీ క్రియేష‌న్స్‌, గోపీకృష్ణా మూవీస్ ప‌తాకాల‌పై నిర్మిత‌మ‌వుతోన్న

సాయిప‌ల్ల‌విని ఫాలో అయిన మిల్కీ బ్యూటీ

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా.. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ప‌దిహేనేళ్లు అవుతుంది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో హీరోయిన్‌గా న‌టించి త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది.

ఆ క్రెడిట్ ఎన్టీఆర్‌కే దక్క‌నుందా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నేటి త‌రం హీరోల్లో అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకోబోతున్నారు. ఇంత‌కూ ఏమీటా ఘ‌న‌త అనుకునే వివ‌రాల్లోకెళ్తే..

టైమ్ వేస్ట్ చేయ‌కూడ‌ద‌నుకుంటున్న ప్ర‌భాస్ టీమ్‌

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం త‌న 20వ సినిమా బిజీలో ఉన్నారు. రీసెంట్‌గానే అంటే లాక్‌డౌన్ అనౌన్స్‌మెంట్‌కు ముందుగానే చిత్ర యూనిట్ జార్జియా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని హైద‌రాబాద్ చేరుకుంది.

హీరోయిన్స్ పై బ్రహ్మాజీ ఫైర్!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో.. టాలీవుడ్ నటులు పెద్ద మనసు చేసుకుని క్లిష్ట పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వాలకు తమ వంతుగా సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు.