close
Choose your channels

139 మంది అత్యాచారం కేసులో డాలర్ భాయ్ అరెస్ట్

Friday, October 23, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

డాలర్‌ భాయ్‌ని సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తనపై 139 మంది అత్యాచారం చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అత్యాచార ఆరోపణలు డాలర్‌ భాయ్‌ ఎదుర్కొంటున్నారు. ఆగస్టు 20న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో డాలర్‌భాయ్‌పై యువతి ఫిర్యాదు చేసింది. ఇప్పటికే సీసీఎస్‌ పోలీసులు పలువురిని అరెస్ట్‌ చేసి విచారించారు. ఎట్టకేలకు పంజాగుట్ట పోలీసులు డాలర్ భాయ్‌ని అరెస్ట్ చేశారు.

తనపై 139 మంది అత్యాచారం జరిపారంటూ ఓ యువతి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దానిలో సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారని చెప్పింది. అంతేకాదు.. పంజాగుట్టలో తనపై 139 మంది అత్యాచారం జరిపారని కేసు కూడా పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో ఉండగానే మరో సంచలనానికి తెరదీసింది. ఈ కేసులో ఆది నుంచి కీలక పాత్ర పోషిస్తున్న డాలర్ భాయ్.. చెప్పినట్టే చేశానని తనపై ఎవరూ అఘాయిత్యానికి పాల్పడలేదని ట్విస్ట్ ఇచ్చింది. డాలర్‌ భాయ్‌ తన పట్ల సైకోలా వ్యవహరించాడని తెలిపింది.

తనకు పరిచయం కూడా లేనివారిపై కూడా డాలర్ భాయ్ కేసులు పెట్టించాడని వెల్లడించింది. మొత్తం డాలర్‌ భాయ్‌ చెప్పినట్లే చేశానని పేర్కొంది. ప్రెస్‌మీట్‌లో ఏం చెప్పాలో రాత్రిపూట తనకు డిక్టేట్‌ చేసేవాడని వెల్లడించింది. తన వల్ల అమాయకులకు శిక్ష పడకూడదని భావించానని అందుకే నిజానిజాలు వెల్లడిస్తున్నట్టు చెప్పింది. ఫొటోలు, వీడియోలు తీసి తనను డాలర్ భాయ్ బెదిరించాడని వెల్లడించింది. 139మంది తనపై అఘాయిత్యానికి పాల్పడలేదని స్పష్టం చేసింది. తాను చెప్పినట్లు చేయకపోతే తన కుటుంబాన్ని చంపుతామని బెదిరించాడని సదరు యువతి వెల్లడించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.