close
Choose your channels

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు ఢ‌బుల్ ధ‌మాకా

Sunday, December 16, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు ఢ‌బుల్ ధ‌మాకా

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ 'బాహుబ‌లి 2' త‌ర్వాత 'సాహో' చిత్రీక‌ర‌ణ‌తో పాటు జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. సాహో 2019లో విడుద‌ల‌వుతుంద‌నే సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ఈ సినిమాను పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది ఆగ‌స్ట్‌లో విడుద‌ల చేసేలా నిర్మాత‌లు ప్లానింగ్ చేస్తున్నారు. కాగా ఇప్పుడు రాధాకృష్ణ కూడా త‌న సినిమాను వ‌చ్చే ఏడాది చివ‌రికంతా సిద్ధం చేసేస్తాన‌ని, ఎక్కువ స‌మ‌యం తీసుకోన‌న్న‌ట్లు తెలిపాడు.

పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రం ఇటీవ‌లే ఇట‌లీతో చిత్రీక‌ర‌ణ స్టార్ట్ చేసింది. అంతా ప్లానింగ్ ప్ర‌కారం జ‌రిగితే.. వ‌చ్చే ఏడాది ప్ర‌భాస్ రెండు సినిమాలు విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.