కరోనాపై పోరుకు ఏపీలో ‘డాక్టర్‌ వైయస్సార్‌ టెలిమెడిసన్‌‌’...

కోవిడ్‌ –19 నివారణా చర్యల్లో భాగంగా డాక్టర్‌ వైయస్సార్‌ టెలిమెడిసన్‌‌ను సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇవాళ క్యాంపు కార్యాలయంలో డాక్టర్‌ వైయస్సార్‌ టెలిమెడిసిన్‌ కార్యక్రమాన్ని జగన్ ప్రాంభించారు. ఈ సందర్భంగా టెలిమెడిసన్ టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి డాక్టర్‌తో నేరుగా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ విధానాన్ని పటిష్టంగా, బలోపేతంగా నడపాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, అవసరమైతే వైద్యుల సంఖ్యనూ పెంచాలని సీఎం ఆదేశించారు.

‘డాక్టర్‌ వైయస్సార్‌ టెలి మెడిసిన్‌’ ఎలా పనిచేస్తుందంటే...:

- రాష్ట్రంలో డాక్టర్‌ వైయస్సార్‌ టెలి మెడిసిన్‌ అమలు కోసం ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నెంబరు: 14410 కేటాయింపు.

- ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా సేవలందించేందుకు, ఈనెల 11వ తేదీ నాటికే 286 మంది వైద్యులు, 114 మంది ఎగ్జిక్యూటివ్స్‌ పేర్లు నమోదు.

- డాక్టర్‌ వైయస్సార్‌ టెలి మెడిసిన్‌లో ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూడు షిఫ్టుల్లో ఆరోగ్య సేవలు.

టెలి మెడిసిన్‌ ఉద్దేశం:

– కోవిడ్‌–19 కేసులను గుర్తించడం, ఐసొలేట్‌ చేయడం, పరీక్షించడం, క్వారంటైన్‌కు పంపించడం.

– ఓపీ సేవలు, ఔషధాల కోసం టెలిఫోన్‌ ద్వారా వైద్యుల సూచనలు, సలహాలు.

– డాక్టర్లకు ఇంటర్నెట్‌ సదుపాయం ఉంటుంది. టెక్నికల్‌ అసిస్టెన్స్‌ టెక్నాలజీ టీం నుంచి లభిస్తుంది.

మూడంచెలుగా ‘డాక్టర్‌ వైయస్సార్‌ టెలి మెడిసిన్‌’:

స్టెప్‌–1:

– 14410 టోల్‌ ఫ్రీ నెంబరుకు రోగులు మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు. అక్కడి సిస్టమ్‌ ఆ మొబైల్‌ నెంబరును, మొత్తం వివరాలను నమోదు చేసుకుంటుంది.

– ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్‌ రోగికి కాల్‌ చేసి, వారు ఉంటున్న ప్రదేశం, వయసు, రోగ లక్షణాల వంటి పూర్తి వివరాలు తెలుసుకుంటారు.

– రోగికి ఒక గుర్తింపు సంఖ్య (ఐడీ) ఇస్తారు.

స్టెప్‌–2:

– రోగి వివరాలన్నీ టెలి మెడిసిన్‌ వ్యవస్థకు కనెక్ట్‌ అయిన వైద్యులందరికీ కనిపిస్తాయి.

– ఆ సమయంలో డాక్టర్ల బృందంలో ఎవరో ఒకరు ఆ కాల్‌ను స్వీకరించి, కాల్‌చేసి ఓపీ సేవలు అందిస్తారు.

– ఆ రోగికి నిర్వహించవలసిన పరీక్షలు, అందించాల్సిన మందులను వైద్యులు తెలియజేస్తారు.

– వ్యాధి లక్షణాలను బట్టి కోవిడ్‌–19 అనుమానిత రోగులను గుర్తిస్తారు.

– ఆ తర్వాత ఎస్‌ఎంఎస్‌ ద్వారా చికిత్స వివరాలు రోగికి అందుతాయి.

– అవసరమైన సందర్భాల్లో వీడియో కన్సల్టేషన్‌కూడా ఉంటుంది.

– అవసరమైతే వీరిని ఏ ఆస్పత్రికి పంపించాలి, ఎక్కడకు పంపించాలన్నదానిపై కూడా వైద్యులు నిర్ణయం తీసుకుని ఆమేరకు వారిని తరలిస్తారు.

స్టెప్‌–3:

– కోవిడ్‌–19 అనుమానిత కేసుల జాబితాల రూపకల్పన.

– ఆ రోగులకు అవసరమైన పరీక్షలు, క్వారంటైన్, ఐసొలేషన్‌తో పాటు చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆ జాబితాలు.

– ఈ జాబితాలను జిల్లా అధాకారులకు పంపిస్తారు. తీసుకోవాల్సిన చర్యలన్నీ సక్రమంగా జరిగేలా చూసుకుంటారు.

వైద్యాధికారి–పీహెచ్‌సీ:

– ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్యాధికారులకు ప్రిస్కిప్షన్లు పంపిస్తారు.

– ప్రతి ఒక్క రోగికి అవసరమైన ఔషథాలను ప్రత్యేకంగా ప్యాక్‌ చేసి ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎంలు, గ్రామ వార్డు వలంటీర్ల ద్వారా రోగులకు నేరుగా ఇంటికే పంపిస్తారు.

– నాన్‌ కోవిడ్‌ రోగులకు కూడా మందులు అందించే కార్యక్రమం కొనసాగుతుంది.

More News

కరోనా నేపథ్యంలోనూ విజయసాయి వర్సెస్ మెగా బ్రదర్

కరోనా మహమ్మారి కాటేస్తున్న నేపథ్యంలోనూ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రాజకీయాలు ఆగట్లేదు. తమ వంతు సాయం చేసి పేదలను.. కరోనా బాధితులను ఆదుకోవాల్సిన నేతలు విమర్శలు

కేటీఆర్ పంచ్‌కి నా ముక్కు వాచింది: ఆర్జీవీ

వివాద‌స్పద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌కు ఇప్పుడు ఏకైక స్నేహితుడు సోష‌ల్ మీడియానే. సాధార‌ణ స‌మ‌యాల్లోనే సోషల్ మీడియాను ప్ర‌ధాన ఆయుధంగా

'మ‌హాస‌ముద్రం'లో సాయిప‌ల్ల‌వి

తొలి చిత్రం ‘ఆర్‌.ఎక్స్ 100’తో సూప‌ర్‌హిట్ అందుకున్నాడు అజ‌య్ భూప‌తి. త‌ర్వాత ‘మ‌హా స‌ముద్రం’ అనే మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడు.

రకుల్ ప్రీత్ టీ షర్ట్ ఛాలెంజ్

నేటి త‌రం కుర్ర హీరోయిన్స్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు ఫిట్‌నెస్ విష‌యంలో ఉన్నంత కేర్ మ‌రొక‌రికీ లేదంటే అవున‌న‌క త‌ప్ప‌దు. ఎందుకంటే ర‌కుల్‌కు ఏ మాత్రం ఖాళీ దొరికినా ఏదో ర‌క‌మైన

ప్యాన్ ఇండియా ప్ర‌య‌త్నం చేస్తున్న నిఖిల్‌

యువ క‌థానాయ‌కుడు నిఖిల్ గ‌త ఏడాది ‘అర్జున సుర‌వ‌రం’తో స‌క్సెస్ సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నాడు.