భారత్‌లో తొలిసారి అందుబాటులోకి డ్రైవర్‌ రహిత రైలు..

భారత్‌లో తొలిసారి డ్రైవర్‌ రహిత రైలు అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ మెట్రోలో డ్రైవర్ రహిత రైలును ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. మెజెంటా లైన్‌లో డ్రైవర్ రహిత మెట్రో రైలు పరుగులు తీసింది. దేశంలోనే ఇది మొట్ట మొదటి డ్రైవర్ రహిత రైలు కావడం విశేషం.  పశ్చిమ జనక్‌పురి - బొటానికల్ గార్డెన్ మధ్య సుమారు 37 కిలోమీటర్ల పొడవున్న మెజంటా లైన్‌లో డ్రైవర్ రహిత రైలు సేవలు అందించనుంది. నేటి నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... ‘స్మార్ట్  వ్యవస్థ’ దిశగా భారత్ ఎంత వేగంగా దూసుకెళ్తుందో చెప్పడానికి ఇదో నిదర్శనమని పేర్కొన్నారు. ఢిల్లీ మెట్రో ఇప్పుడు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ ద్వారా అనుసంధానించబడిందని తెలిపారు. మాజీ ప్రధాని వాజ్‌పాయ్ కృషి వల్లే దేశంలో మొట్టమొదటి మెట్రో రైలు సాధ్యమైందని గుర్తు చేసుకున్నారు. 2014 లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డ సమయంలో కేవలం ఐదు పట్టణాల్లో మాత్రమే మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండేవని, కానీ... నేడు 18 పట్టణాల్లో మెట్రో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు.

డ్రైవర్ రహిత మెట్రో రైలు ప్రారంభమైన సందర్భంగా ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్ స్పందించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నడిచే మెరుగైన రవాణా వ్యవస్థకు సంబంధించి నవ శకానికి ఇది ప్రారంభమని తెలిపింది. డ్రైవర్ రహిత మెట్రో రైలు సేవలను 2021 మధ్య కాలం నాటికి మజ్లిస్ పార్క్-శివ విహార్ మధ్య 57 కిలో మీటర్లు పొడవున్న పింక్ లైన్ మార్గంలోనూ విస్తరించనున్నట్టు వెల్లడించింది. ఈ పింక్ లైన్ కూడా ప్రారంభమైతే ఢిల్లీ మెట్రోలో 94 కిలో మీటర్ల మేర డ్రైవర్ రహిత మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్ వెల్లడించింది.

More News

వైఎస్‌పై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు...

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఎవరో ఒకరి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూనో..

యాక్ష‌న్ హీరోను ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ చేస్తున్న మారుతి..!

ఓ సినిమా సెట్స్‌లో ఉండ‌గానే మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డ‌మే కాకుండా.. సినిమా ముగియ‌గానే కొత్త సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు

మోదీ గడ్డం వెనుక అసలు కారణం ఇదేనట...

ప్రధాని మోదీ ఇటీవల కొంతకాలంగా తెల్లటి గడ్డంతో మెరిసిపోతున్నారు.

క్రేజీ టైటిల్‌.. స్టార్ ప్రొడ్యూస‌ర్‌తో క‌ల్యాణ్‌రామ్‌..!

ఒక‌వైపు హీరోగా, మ‌రోవైపు నిర్మాత‌గా సినిమా రంగంలో బిజీగా ఉంటున్న వ్య‌క్తి నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌.

రిలయన్స్‌ జియోపై యుద్ధం ప్రకటించిన రైతులు..

గత కొన్ని రోజులుగా వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కేంద్రంపై యుద్ధానికి దిగిన రైతులు తాజాగా రిలయన్స్ కంపెనీపై తమ యుద్ధాన్ని ప్రకటించారు.