చేతిలో బీర్ బాటిల్‌తో డ్రైవింగ్.. నలుగురి మృతి

  • IndiaGlitz, [Tuesday,March 02 2021]

మద్యం మత్తులో కారు నడిపి నలుగురి చావుకు కారణమయ్యాడో వ్యక్తి. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం అమ్మవారిపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కియా కార్ల పరిశ్రమ ప్రధాన గేటు వద్ద 44వ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. కియా గేటు వద్ద స్పీడ్ బ్రేకర్ ఉంది. ఒక కారు డ్రైవర్ ఆ స్పీడ్ బ్రేకర్ వద్దకు రాగానే స్లో చేశాడు. వెనుక నుంచి ఒక కారు అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాదానికి గురైన కారు బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు వెళుతుండగా ఈ దారుణం జరిగింది. ప్రమాదానికి గురైన కారు డ్రైవర్ చేతిలో బీర్ బాటిల్‌ను పోలీసులు గుర్తించారు. ఒక చేతిలో బీర్ బాటిల్‌తో మరో చేతితో స్టీరింగ్ పట్టుకుని.. మొత్తానికి దారుణమైన ఘోర ప్రమాదానికి సదరు డ్రైవర్ కారణమయ్యాడు. ఈ ప్రమాదంలో బెంగళూరుకు చెందిన మనోజ్ విట్టల్, అతనితో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. కారును పక్కకు తీసి పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

మృతదేహాలను పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి.. వారి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. మృతిచెందిన వారిలో రేఖ కిషన్ గంజ్ నార్త్ దిల్లీ, ఆంచల్ సింగ్(21), మహబూబ్ ఆలం(31) ఆర్.టీ.నగర్ నార్త్ బెంగళూరు, మనోజ్ మిట్టల్ (38) ప్లాటినం సిటీ నార్త్ బెంగళూరు ఉన్నారు.

More News

గృహ రుణం తీసుకోవాలనుకుంటున్న వారికి ఎస్‌బీఐ గుడ్ న్యూస్

గృహ రుణం తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ న్యూస్ కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

‘సారంగదరియా’ ఎంత హైపో.. అంతే విమర్శలు..

యూట్యూబ్ సెన్సేషన్.. రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే లక్షల్లో వ్యూస్.. లక్షల్లో లైక్స్.. తెలంగాణ పల్లె నుంచి పుట్టిన పురాతన ట్యూన్..

సుధీర్ బాబు, మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేష‌న్లో మూడో చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'

'సమ్మోహనం', 'వి' తర్వాత హీరో సుధీర్ బాబు, ద‌ర్శ‌కుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేష‌న్లో మూడో చిత్రం రూపోందుతోంది.

కీర్తి సురేష్ 'గుడ్ ల‌క్ స‌ఖి' జూన్ 3న విడుద‌ల‌

జాతీయ ఉత్త‌మ‌న‌టి కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'గుడ్ ల‌క్ స‌ఖి'. ఆది పినిశెట్టి హీరోగా న‌టిస్తుండ‌గా, జ‌గ‌ప‌తిబాబు ఓ కీల‌క పాత్ర చేస్తున్నారు.

మ‌డ్ రేస్ యొక్క రియ‌ల్ యాంబియ‌న్స్‌ని ఎక్స్‌పీరియ‌న్స్ చేసే మూవీ 'మడ్డి' - చిత్ర ద‌ర్శ‌కుడు డా. ప్ర‌గ‌భ‌ల్‌

పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ చిత్రం `మడ్డి`.