close
Choose your channels

దుబ్బాక: తొలిరౌండ్‌లో ఆధిక్యంలో బీజేపీ...

Tuesday, November 10, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దుబ్బాక: తొలిరౌండ్‌లో ఆధిక్యంలో బీజేపీ...

దుబ్బాక ఉపఎన్నిక ఫలితం నేడు తేలనుంది. తొలి రౌండ్‌లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. సిద్దిపేట శివారు ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీలో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తి ఫలితం రానుంది. 315 పోలింగ్‌ కేంద్రాల్లో పోలైన ఓట్లు 1,64,192 కాగా.. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ముగిసింది. దుబ్బాకలో 1453 పోస్టల్ బ్యాలెట్, 51 సర్వీస్ ఓట్లు ఉన్నాయి. దీనిలో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. కౌంటింగ్ కోసం అధికారులు 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగనుంది.

తొలిరౌండ్‌లో బీజేపీ ఆధిక్యం..

దుబ్బాకలో 341 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ
తొలిరౌండ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు 3,208 ఓట్లు
తొలిరౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతకు 2,867 ఓట్లు
కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డికి 648 ఓట్లు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.