close
Choose your channels

దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్.. వ్యూహాలకు పదును పెడుతున్న పార్టీలు

Tuesday, September 29, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక నిర్వహణకు మంగళవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌‌ను రిలీజ్ చేసింది. ఇటీవల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో దుబ్బాక అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానానికిగాను ఎన్నికల సంఘం ఇవాళ ఉపఎన్నిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. దుబ్బాక మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా 56 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం నేడు ఉపఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.

కాగా.. అక్టోబర్ 9న ఉప ఎన్నికకు నోటిఫికేషన్.. నామినేషన్‌కు చివరి తేదీ అక్టోబర్ 16. ఇక అక్టోబర్ 17న నామినేషన్ల పరీశీలన ఉంటుంది. అక్టోబర్ 19న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. నవంబరు 3న పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న కౌంటింగ్ జరగనుంది. కాగా తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా తేదీలు ప్రకటించలేదు.

ఇప్పటికే తెలంగాణలో అధికార, ప్రతిపక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. దుబ్బాక స్థానం టీఆర్ఎస్‌దే అయినప్పటికీ అక్కడ పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇటీవలే ఈ ఉపఎన్నికపై తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్ రాష్ట్ర నేతలతో చర్చించి.. అనుసరించాల్సిన వ్యూహాలను సూచించినట్టు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ కూడా అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. టీఆర్ఎస్ మాత్రం మళ్లీ గులాబీ జెండానే ఎగురుతుందన్న ధీమాతో ఉన్నప్పటికీ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.