ఇక‌పై డ‌బ్బింగ్ సినిమాల‌కు ఇబ్బందేనా..!

  • IndiaGlitz, [Monday,April 20 2020]

కోవిడ్ 19 కార‌ణంగా ప్ర‌పంచ‌మంతా స్తంభించింది. ప‌లు దేశాలు కోవిడ్ 19 నుండి బారి నుండి త‌ప్పించుకోవ‌డానికి లాక్‌డౌన్ విధానాన్ని పాటిస్తున్నాయి. అలా లాక్‌డౌన్‌ను పాటిస్తున్న దేశాల్లో మ‌న దేశం కూడా ఉంది. మే 3 వ‌ర‌కు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ఉంటే.. మే 7 వ‌ర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ను కొన‌సాగించ‌నుంది. ఈ క్ర‌మంలో దేశంలో ప‌లు రంగాలు చాలా ఇబ్బందులతో కుంటుప‌డుతున్నాయి. అలాంటి ఇబ్బందుల‌ను ఎదుర్కొంటుంది సినీ ప‌రిశ్ర‌మ‌. ఇప్ప‌టికే మార్చి మూడో వారం నుండి విడుద‌ల కావాల్సిన సినిమాలు ఆగిపోయాయి. ఇంకా ఎప్ప‌టికి విడుద‌ల‌వుతాయో తెలియ‌దు.

ఒక‌వేళ లాక్‌డౌన్‌ను తొల‌గించినా థియేట‌ర్స్ ఓపెన్ చేయ‌డానికి ప్ర‌భుత్వాలు అనుమ‌తినిస్తాయా? అనేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. ఈ ప‌రిస్థితిని అధిగ‌మించాలంటే ఏం చేయాల‌ని సినీ ప‌రిశ్ర‌మ‌లోని పెద్ద‌లు ఆలోచ‌న చేస్తున్నారు. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఇప్పుడున్న సినిమాల‌కు భ‌విష్య‌త్తులో థియేట‌ర్స్ స‌మ‌స్య లేకుండా చూడాలనుకుంటున్నారట‌. అందుకోసం డ‌బ్బింగ్ సినిమాల‌ను ఇప్ప‌ట్లో విడుద‌ల చేయ‌కుండా నియ‌మం పెట్టుకోవాల‌ని ఆలోచ‌న‌లు చేస్తున్నార‌ట‌. దీంతో కొంత మేర థియేట‌ర్స్ స‌మ‌స్య తగ్గే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నార‌ట‌. ఒక‌వేళ ఇది నిజ‌మై రూల్‌ను పాస్ చేస్తే డ‌బ్బింగ్ సినిమాల‌కు, స‌ద‌రు సినిమాల‌ను కొన్న నిర్మాత‌ల‌కు ఇబ్బందులు ఎదురయ్యే అవ‌కాశ‌ముంద‌ని టాక్‌.

More News

'వ‌కీల్‌సాబ్' కోసం ప‌వ‌న్ ప‌డ్డ క‌ష్టం

సినిమాలకు రెండేళ్లు దూరమై రాజకీయాల్లోనే గడిపిన జ‌న‌సేనాని,ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సైలెంట్‌గా సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేశాడు.

చంద్రబాబుకు చిరు బర్త్ డే విషెస్

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పుట్టిన రోజు నేడు. ఇవాళ్టితో ఆయన 70వ పడిలోకి అడుగుపెట్టారు.

సినీ కార్మికుల ఆ పని చేయ‌డానికి కూడా సిద్ధ‌మేనంటున్న మెగాస్టార్‌

కరోనా వైరస్ ప్రభావంతో దేశమంతటా లాక్ క్ డౌన్ కొనసాగుతోంది. మే 3 వరకు ఈ పరిస్థితి ఇలాగే ఉంటుంది. తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేమంటున్నారు

'పుష్ప'లో బ‌న్నీ స‌ర్‌ప్రైజ్ ఇదేనా..?

టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా చిత్రంగా చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగే

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో సినిమా గురించి జ‌క్క‌న్న ఏం చెప్పారంటే...!!

ఇండియ‌న్ సినిమాలో ఇప్పుడు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్. ఆయ‌నతో సినిమాలు చేయాల‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.