జనతా హోటల్ టీజర్ విడుదల

  • IndiaGlitz, [Friday,September 07 2018]

ప్రేమిస్తే, షాపింగ్ మాల్, జర్నీ లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించిన సురేష్ కొండేటి ఇప్పుడు మరో చక్కటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. 'మహానటి' ఫేం దుల్కర్ సల్మాన్, టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ జంటగా నటించిన చిత్రం ఉస్తాద్ హోటల్.

మళయాలంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను సురేష్ కొండేటి తెలుగులో 'జనతా హోటల్' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ నెల 14న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఎప్పుడూ విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న సురేష్ కొండేటి..

ఈ సినిమా విషయంలో మరింత వైవిధ్యాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నారు. మరో 7 రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ను రోజుకో టీజర్ చొప్పున ఏడు రోజుల పాటు విడుదల చేయనున్నారు. అందులో భాగంగా నేడు మొదటి టీజర్ విడుదలైంది.

మగ పిల్లాడు కావాలనుకున్న ఓ తండ్రికి వరుసగా నలుగురు ఆడపిల్లలకు పుట్టడం.. అయినా ఆశ చంపుకోని అతడికి ఎట్టకేలకు ఐదో సంతానంగా మగ పిల్లాడు పుట్టడం.. ఆ పిల్లవాడు తండ్రికి నచ్చింది కాకుండా.. తనకు నచ్చింది చేయడం.. చివరికి పెళ్లి చూపుల్లో తన క్వాలిఫికేషన్ గురించి అమ్మాయి అడిగితే.. తాను విదేశాలకు వెళ్లి చదివింది చెఫ్ కోర్సు మాత్రమేనని చెప్పడం.. ఇలా ఆద్యంతం ఆసక్తిరేకెత్తిస్తున్న సన్నివేశాలతో టీజర్ ఆకట్టుకుంటోంది.

More News

యు ట‌ర్న్ సెన్సార్ పూర్తి..

సమంత ప్రదానపాత్రలో నటించిన చిత్రం యు ట‌ర్న్. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి 'U/A' స‌ర్టిఫికేట్ ఇచ్చారు.

'అనగనగ ఓ ప్రేమకథ' తొలి ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించిన  వరుణ్ తేజ్

ప్రముఖ నిర్మాత డి వి ఎస్ రాజు గారి అల్లుడు కె. ఎల్.ఎన్ రాజు గారు గత ౩౦ సంవత్సరాలుగా సినిమా రంగంలో ప్రముఖ నిర్మాతలకు ఫైనాన్షియర్ గా పేరుపొంది ఉన్నారు.

వినాయక చవతికి విడులవుతున్న 'మసక్కలి'

కొన్ని కథలు విని నమ్ముతాం.. కొన్ని కథలు చూసి నమ్ముతాం.. మరికొన్ని కథలు చూసినా నమ్మలేని విధంగా ఉంటాయి..

ఉత్కంఠతను పెంచే యాక్షన్ కింగ్ అర్జున్ 150వ సినిమా 'కురుక్షేత్రం'

యాంక్షన్ కింగ్ అర్జున్ నటించిన 150 సినిమా కురుక్షేత్రం వినాయక చవితి సందర్భంగా విడుదలకు సిద్దం అయ్యింది.

ప్రభాస్ త్రిభాషా చిత్రం

తెలుగు చిత్ర పరిశ్రమలో గోపికృష్ణా మూవీస్ బ్యానర్ ది ప్రత్యేక స్థానం. అలాంటి గోపికృష్ణా మూవీస్ బ్యానర్ లో సీనియర్ నటుడు