కౌంటింగ్‌కు ముందు విపక్షాలకు షాకిచ్చిన ఈసీ

  • IndiaGlitz, [Wednesday,May 22 2019]

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా రేపు కౌంటింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించి తీరాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ మార్పు చేర్పులపై ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చేసింది.

బుధవారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కీలక సమావేశం ఏర్పాటు చేసి.. దేశవ్యాప్తంగా కౌంటింగ్‌ ఏర్పాట్లపై చర్చించారు. ముందుగా వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలన్న విపక్షాల డిమాండ్‌పై కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.

కౌంటింగ్‌ ప్రక్రియలో ఎలాంటి మార్పుల్లేవని ఈసీ తేల్చిచెప్పింది. వీవీప్యాట్ల లెక్కింపుపై ప్రతిపక్షాల డిమాండ్‌ను తోసిపుచ్చింది. ఈవీఎంల లెక్కింపు తర్వాతే వీవీప్యాట్ల లెక్కింపు ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. నలభై మూడు రోజుల ఎదురుచూపులకు తెరపడి ఈవీఎంలు తెరుచుకుని తీర్పు వెల్లడయ్యేందుకు ఇక కొన్ని గంటలు మాత్రమే మిగిలుంది.

ఏ నేతలు అసెంబ్లీ, పార్లమెంట్‌లోకి అడుగుపెడతారో.. ఎవరి ఇంటిబాట పడతారో అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. కాగా.. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం రాబోతోందని ఇప్పటికే పలు జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌లో తేల్చాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. కొన్ని టీడీపీ గెలుస్తుందని.. మరికొన్ని సర్వేలు వైసీపీ కచ్చితంగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేల్చేశాయి. సో.. కేంద్రంలో ఎవరొస్తారో.. ఏపీలో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోబోతున్నారో తెలియాలంటే గురువారం మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సిందే మరి.

More News

మహేష్ బాబు కొత్త సినిమా ప్రారంభమయ్యేది ఆ రోజునే...

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఇండియా లేడు. `మ‌హ‌ర్షి` స‌క్సెస్‌ను సెల‌బ్రేట్ చేసుకుంటూ సమ్మ‌ర్‌వెకేష‌న్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఈయ‌న త‌దుప‌రి చేయ‌బోయే 26వ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ పనులు...

టీవీ9 వివాదం పై రవిప్రకాష్ సంచలన వీడియో విడుదల

టీవీ9 వివాదంలో రవిప్రకాష్‌కు పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా పోలీసు బృందాలు ఆయనకోసం గాలిస్తున్నారు.

లో దుస్తులు క‌న‌ప‌డేలా శ్రియ డ్యాన్స్‌

ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా తెలుగు, త‌మిళంలో రాణించిన హీరోయిన్ శ్రియాశ‌ర‌న్‌. బాలీవుడ్‌లో కూడా ఈ అమ్మ‌డు ఒక‌ట్రెండు సినిమాల్లో న‌టించింది.

బైక్ రేస్ ట్రైనింగ్‌లో విజ‌య‌దేవ‌ర‌కొండ‌

యూత్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు త‌దుప‌రి సినిమాగా ఆనంద్ అన్నామ‌లై సినిమాను చేస్తున్నాడు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో సినిమా రూపొంద‌నుంది.

'సాహో'కి స‌ల్మాన్ అతిథి అవుతాడా?

'బాహుబ‌లి' త‌ర్వాత యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ సినిమాల‌పై భారీ అంచ‌నాలున్నాయి. ఈ ఏడాది ఆగ‌స్ట్ 15న విడుద‌ల కాబోయే 'సాహో'తో ప్ర‌భాస్ బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌బోతున్నాడు.