MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు.. గులాబీ నేతల్లో టెన్షన్..

  • IndiaGlitz, [Friday,March 15 2024]

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. దీంతో కవిత ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు. ప్రస్తుతం ఆమె ఇల్లు కేంద్ర బలగాల ఆధీనంలో ఉంది. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు ఆమె ఇంటికి భారీగా చేరుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన వ్యవహారంలో ఆమె బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు. ఆమె భర్త వ్యాపారాల గురించి కూడా ఆరా తీస్తున్నారు.

కవిత స్టేట్మెంట్ రికార్డు చేయడంతో పాటు ఆమె రెండు ఫోన్లను సీజ్ చేశారు. ఇంట్లోకి ఎవరిని అనుమతించడం లేదు. ఇందులో ఆ కేసుకు సంబంధించి ఒక్క ఆధారం దొరికినా ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీంతో ఏం జరగనుందనే ఆందోళన గులాబీ నేతల్లో కనిపిస్తోంది. ఈడీ అధికారుల సోదాలపై బీఆర్ఎస్ స్పందించింది. ఎన్నికల కోడ్ మరో 24 గంటల్లో వస్తుందనగా ఈ సోదాలు ఏంటని ఆ పార్టీ నేతలు స్పందిస్తున్నారు.

కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమెను ఇటీవల సీబీఐ నిందితురాలిగా చేర్చిన సంగతి తెలిసిందే. పలుమార్లు విచారణకు హాజరుకావాలని సీబీఐతో పాటు ఈడీ అధికారులు కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ఈడీ సమన్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ నెల 19న విచారణ జరపనున్నట్లు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం స్పష్టం చేసింది.

గతేడాది మార్చిలో కవితను మూడు సార్లు ఢిల్లీలో ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. విచారణకు సహకరించిన కవిత.. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో ఆమె వినియోగించిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సైతం వారికి అప్పగించారు. అప్పుడు రోజుకు దాదాపు 10 గంటలకు పైగా కవితను విచారించారు. అంతసేపు విచారించడంతో ఆమె అరెస్ట్ ఖాయమని జోరుగా ప్రచారం జరిగింది. అయితే అప్పటినుంచి ఆమె విచారణ పెండింగ్‌లోనే ఉంది. ఇప్పుడు ఏకంగా ఆమె ఇంట్లోనే అధికారులు సోదాలు నిర్వహిస్తుండటం తీవ్ర చర్చనీయాంశమైంది.

More News

Mudragada: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం

ఎట్టకేలకు కాపు సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. ముద్రగడకు సీఎం జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Election Schedule: రేపే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన.. కౌంట్‌డౌన్‌ షూరూ..

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రేపు(శనివారం) నగారా మోగనుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్‌ను ప్రకటించనుంది.

Janasena: డల్లాస్‌లో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. హాజరైన కూటమి నేతలు..

అమెరికాలోని డల్లాస్‌లో జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనం జరిగాయి. ఈ వేడుకలకు జనసేన, టీడీపీ, బీజేపీ క్యాడర్‌కు చెందిన కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో SBIపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం.. ఈసీ వెబ్‌సైట్‌లో వివరాలు..

ఎలక్టోరల్ బాండ్ల(Electoral bonds)వ్యవహారంలో SBIపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. బాండ్ల పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది.

నూతన ఎన్నికల కమిషనర్ల బాధ్యతల స్వీకరణ.. ఎన్నికల షెడ్యూల్‌కు వేళాయే

లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ వెల్లడించేందుకు సమయం ఆసన్నమైంది. కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా నియమితులైన జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్‌లు ప్రధాన ఎన్నికల