సెప్టెంబ‌ర్ చివ‌రి వారంలో విడుద‌ల‌వుతున్న 'ఈ మాయ పేరేమిటో'

  • IndiaGlitz, [Thursday,September 06 2018]

సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం 'ఈ మాయ పేరేమిటో'. కావ్యా థాప‌ర్ హీరోయిన్‌. వి.ఎస్‌.వ‌ వర్క్స్ బేనర్‌పై రాము కొప్పుల ద‌ర్శ‌క‌త్వంలో దివ్యా విజ‌య్ ఈ ల‌వ్‌, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను నిర్మించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్‌తో పాటు గ్లోబెల్ సినిమాస్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని నైజామ్‌, ఆంధ్రా ఏరియాల్లో పంఫిణీ చేయ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత దివ్యా విజ‌య్ మాట్లాడుతూ - సినిమాలో రాహుల్ విజ‌య్‌, కావ్యా థాప‌ర్ పెయిర్ తెర‌పై చ‌క్క‌గా ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో పాటు ల‌వ్‌, కామెడీ ఎలిమెంట్స్ స‌హా అన్నీ అంశాల‌తో ద‌ర్శ‌కుడు రాముగారు సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు.

ట్రైల‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌గారు విడుద‌ల చేసిన పాట‌లు ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఆంధ్రాలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌, నైజాంలో గ్లోబల్ సినిమాస్ సంస్థలు మా సినిమాను విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగాఉంది. సినిమాను సెప్టెంబ‌ర్ నాలుగో వారంలో గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

రాహుల్ విజ‌య్‌, కావ్యా థాప‌ర్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ముర‌ళీశ‌ర్మ‌, రాళ్ల‌ప‌ల్లి, ఈశ్వ‌రీరావు, ప‌విత్రా లోకేశ్‌, స‌త్యం రాజేశ్‌, జోశ్ ర‌వి, కాదంబ‌రి కిర‌ణ్ త‌దిత‌రులు ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్‌: విజయ్‌, ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి, ఆర్ట్‌: చిన్నా, సాహిత్యం: శ్రీమ‌ణి, సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీ: శామ్ కె.నాయుడు, నిర్మాత‌: దివ్యా విజ‌య్‌, ద‌ర్శ‌క‌త్వం: రాము కొప్పుల.

More News

'అశ్వమేథం' గణేశుని పాట రిలీజ్

ధృవ్ కరుణాకర్, శివంగి హీరో హీరోయిన్స్ గా నితిన్ జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అశ్వమేథం'..స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లోని గణేశుని పాటని

సిల్లీ ఫెలోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్

సునీల్,అల్లరి నరేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'సిల్లీ ఫెలోస్'.. పూర్ణ, నందిని రాయ్ లు హీరోయిన్లు గా నటిస్తున్న ఏ చిత్రానికి భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు..

పాటల పల్లకి ప్రోమో సాంగ్ విడుదల

శ్రీ ప్రహర్ష దేవి బ్యానర్లో రూపొందుతున్న 'పాటల పల్లకి'. కార్యక్రమం ద్వారా  నూతన గాయనీ గాయకులకు అవకాశం కల్పించి ఉజ్వల భవిష్యత్తును

పూజా ప్ర‌వేట్ ఫ్లైట్‌...

ప్ర‌స్తుతం తెలుగులో స్టార్ హీరోలంద‌రితో న‌టిస్తున్న హీరోయిన్ పూజా హెగ్డే. మ‌హేశ్ స‌ర‌స‌న మ‌హ‌ర్షి, ఎన్టీఆర్‌తో 'అర‌వింద స‌మేత‌'తో పాటు.. ప్ర‌భాస్ స‌ర‌స‌న జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో

రాజ‌మౌళి త‌న‌యుడి ఎంగేజ్‌మెంట్ ఎవ‌రితో తెలుసా?

'మ‌గ‌ధీర' నుండి 'బాహుబ‌లి 2' వ‌ర‌కు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళికి స‌హాయ స‌హ‌కారాల‌ను అందిస్తున్న త‌న‌యుడు కార్తికేయ త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.