ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై ఈసీ బదిలీ వేటు

  • IndiaGlitz, [Tuesday,April 02 2024]

ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐదుగురు ఎస్పీలు, ఓ ఐజీ, ముగ్గురు కలెక్టర్లపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. బదిలీ అయిన అధికారుల్లో ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి , పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు ఉన్నారు. అలాగే ఐఏస్ అధికారుల్లో కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు, అనంతపురం ఎన్నికల అధికారి గిరీజా, తిరుపతి ఎన్నికల అధికారి లక్ష్మీషాలను కూడా బదిలీ చేసింది.

బదిలీ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ విధుల్లో ఉండకూడదని స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా సీఎస్, డీజీపీకి పంపారు. బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారి భర్తీకి ముగ్గురు ఆఫీసర్లతో ప్యానల్ పంపాలని సూచించారు. కాగా ఈ అధికారులు వైసీపీ నేతలకు అనుకూలంగా.. ప్రతిపక్ష నేతలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నాయకుల ఫిర్యాదులతో ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

కాగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పల్నాడు జిల్లా చిలూకలూరిపేటలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్న బహిరంగసభలో గందరగోళం ఏర్పడిన సంగతి తెలిసిందే. భద్రతా వైఫల్యాలపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సభను విఫలం చేయడానికి ఎస్పీలు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం సీఈవోను నివేదిక కోరింది. ఇదే సమయంలో ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో రాజకీయ హత్యలు చోటు చేసుకున్నాయి. పల్నాడు జిల్లాలోని మాచర్లలో దాడులు చోటు చేసుకున్నాయి.

ఈ మూడు ఘటనలను ఈసీ చాలా సీరియస్‌గా తీసుకుంది. హింసను అరికట్టడంలో ఎందుకు విఫలమయ్యారో వివరణ ఇవ్వాలని మూడు జిల్లాల ఎస్పీలను ఆదేశించింది. దీంతో వారు సీఈవో ముందు స్వయంగా హాజరై వివరణ ఇచ్చారు. అయితే పల్నాడు, ప్రకాశం ఎస్పీలు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో బదిలీ వేటు వేసింది. వీరితో పాటు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో కృష్ణా, అనంతపురం, తిరుపతి జిల్లాల కలెక్టర్లపైనా చర్యలు తీసుకుంది. ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ ఈ అధికారులకు ఎన్నికల సంబంధిత విధులు అప్పగించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

More News

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. 'పుష్ప' గాడి మాస్ జాతర మొదలు..

'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాలోని నటనగాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకున్నాడు.

ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్‌లో జూనియర్ ఎన్టీఆర్ సందడి.. ఎందుకంటే..?

మ్యాన్ ఆఫ్‌ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్(JR NTR) తాజాగా మెర్సిడేజ్ బెంజ్ కొత్త కారును కొన్నాడు. దీంతో ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్‌కి వచ్చాడు.

YS Sharmila: అవినాశ్ రెడ్డిపై షర్మిల పోటీ.. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల..

ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం విడుదల చేసింది. 114 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను వెల్లడించింది.

ఏపీలో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

ఏపీలోని పాఠశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు కొనసాగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారక ప్రకటన విడుదల చేసింది.

వైసీపీకి ఓటు వేయొద్దు.. వివేకాను ఎవరు చంపారో ప్రజలకు తెలుసు: సునీత

వైసీపీ పునాదులు రక్తంతో తడిసిపోయాయని మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి తెలిపారు. వివేకా హత్య జరిగిన తర్వాత జగన్ అన్న