రాయ్లక్ష్మికి కరెంట్ షాక్
Send us your feedback to audioarticles@vaarta.com
సాధారణంగా సోయగాలతో అభిమానులకు, ప్రేక్షకులకు షాకిచ్చే పనిని హీరోయిన్స్ చేస్తుంటారు. కానీ రాయ్లక్ష్మికి మాత్రం వింత పరిస్థితి ఎందురైందట. విద్యుత్శాఖ వారు రాయ్లక్ష్మికి గత మూడు నెలలుగా ఆమె కట్టాల్సిన బిల్లుకంటే రెట్టింపు బిల్లు ఇచ్చి షాకిచ్చారు. ఈ విషయంపై రాయ్ లక్ష్మి తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ``నేను మూడు నెలలుగా మా ఇంటికి వచ్చే కరెంట్ బిల్లును గమనిస్తున్నాను. నేను ఎంత బిల్ పే చేస్తున్నానో దానికి రెట్టింపు మొత్తం బిల్లు మరుసటి నెలలో వస్తుంది.
మూడు నెలలుగా ఇదే సమస్య వస్తుంది. పరిష్కారం కోసం అదాని ఎలక్ట్రసిటీ వారి టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసినా రెస్పాండ్ కావడం లేదు. నాలాగే ఇంకెంత మంది బాధపడుతున్నారో. కష్టపడి డబ్బు సంపాదించి ఇలా కట్టాలంటే బాధగా ఉంది`` అన్నారు రాయ్ లక్ష్మి. దీనిపై స్పందించిన అదాని ఎలక్ట్రసిటీ బోర్డ్ స్సందిస్తూ ``మీకు అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నాం. ఈ అకౌంట్ నెంబర్, కాంటాక్ట్ వివరాలను మెసేజ్ చేయగలరు. మీ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం`` అంటూ రిప్లై ఇచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.