Postal Ballot: పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వైసీపీకే.. సీఎం జగన్‌ వైపే ఉద్యోగుల చూపు..!

  • IndiaGlitz, [Monday,May 06 2024]

ఏపీలో ఎన్నికల పోలింగ్‌కు సరిగ్గా వారం రోజులు సమయం మాత్రమే ఉంది. వచ్చే సోమవారం పోలింగ్ జరగనుంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఎండల కంటే ఎక్కువగా హీటెక్కింది. మరోవైపు శనివారం నుంచి రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఉద్యోగుల ఓట్లు అధికార వైసీపీకే పడుతున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. ఓటు వేసిన ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు జగన్ పార్టీకే వేశామని చెబుతున్నారని తెలుస్తోంది.

దాదాపు 80శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీకే అనుకూలంగా ఓట్లు వేస్తున్నారని సమాచారం. ఉద్యోగులు జగన్ వైపు మొగ్గు చూపడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగులను చిన్నచూపు చూసిన సందర్భాలు ఉన్నాయి. ఉద్యోగుల జీతాల విషయంలో బాబు చేసిన అవహేళన సులువుగా మరిచిపోలేరు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు పయోజనం చేకూరేలా బాబు ఎలాంటి హామీలను ప్రకటించలేదు. అదే జగన్ ప్రకటించిన గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ మాత్రం ఉద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఊహించని స్థాయిలో బెనిఫిట్స్ అందజేసే స్కీమ్ అని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు.

చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు ఏరోజు సంతోషంగా లేరు. బాబు రూల్స్ అంటే చీదరించుకునే ఉద్యోగులు చాలామంది ఉన్నారు. మరోవైపు చంద్రబాబు ప్రకటించిన హామీలు అలివి కాని హామీలు అని చెబుతున్నారు. ఆ హామీలను అమలు చేస్తే ప్రతి నెలా కాదు కదా అసలు జీతాలే రావేమో అనే భయం ప్రభుత్వ ఉద్యోగుల్లో నెలకొంది. అందుకే వైసీపీకి అనుకూలంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని.. ఫ్యాన్ గుర్తుకు భారీగా ఓట్లు పోల్ అవుతున్నాయని తెలుస్తోంది. బాబు పాలనకు, జగన్ పాలనకు తేడా గమనించిన ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి జగన్‌కే పట్టం కట్టడానికి సిద్ధమయ్యారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

More News

Telangana BJP:తెలంగాణ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా స్టార్ హీరో ప్రచారం

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు పోరాడుతున్నారు.

Thalaimai Seyalagam:జీ5లో పొలిటిక‌ల్ థ్రిల్లర్ ‘తలమై సెయల్గమ్’ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే..?

భార‌త‌దేశంలో అతి పెద్ద ఓటీటీ మాధ్యమం జీ5. ప‌లు భాష‌ల్లో వైవిధ్యమైన సినిమాలు, సిరీస్‌ల‌తో ప్రేక్షకుల‌కు అప‌రిమిత‌మైన వినోదాన్ని ఇది అందిస్తోంది.

Sharmila:సీఎం జగన్ మానసిక స్థితి గురించి భయం వేస్తోంది: షర్మిల

సీఎం జగన్‌కు చంద్రబాబు పిచ్చి పట్టుకున్నట్టుందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. చంద్రబాబుతో ఈ వైఎస్సార్ బిడ్డ చేతులు కలిపినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు.

Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వంలో దాడులు, దోపిడీలే: పవన్ కల్యాణ్

రాబోయే ఎన్నికల్లో కూటమిదే విజయమని.. మెజారిటీ ఎంత అనేది మాత్రమే తేలాల్సి ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ధీమా వ్యక్తంచేశారు.

CM Jagan:చంద్రబాబు మాటలు నమ్మకండి.. బాలయ్య అడ్డాలో సీఎం జగన్ పిలుపు..

ఏపీ ఎన్నికల వేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై పెద్ద రాజకీయ దుమారం రేగుతోంది. ఈ చట్టంతో ప్రజల భూములు లొక్కొంటారని..