close
Choose your channels

'ఎంత మంచివాడ‌వురా' తొలి లిరిక‌ల్ వీడియో సాంగ్ విడుద‌ల‌

Monday, December 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో.. ఓ కొంచెం పాలు పంచుకుందాం
ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధ‌ముందో.. బంధువుల సంఖ్య పెంచుకుందాం..``
అని అంటున్నారు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌.

ఈయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `ఎంత మంచివాడ‌వురా`. సంక్రాంతి సంద‌ర్భంగా ఈ చిత్రం జ‌న‌వ‌రి 15న విడుద‌ల‌వుతుంది. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'శతమానం భవతి' చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన తొలి లిరిక‌ల్ వీడియో సాంగ్ `ఏమో ఏమో ఏ గుండెల్లో ..`ను చిత్ర యూనిట్ ఆదివారం విడుద‌ల చేసింది. గాన గంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల సుబ్ర‌మ‌ణ్యం ఈ పాట‌ల‌ను ఆల‌పించారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ గోపీసుంద‌ర్ బ్యూటీఫుల్ ట్యూన్‌కి ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు.

ఈ సంద‌ర్భంగా ..
నిర్మాత ఆదిత్య ఉమేష్ గుప్తా మాట్లాడుతూ ``
సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 15న గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. కళ్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న కాంబినేష‌న్‌లో రూపొందిన బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఈ అంద‌మైన కుటుంబ క‌థా చిత్రాన్ని అద్భుత‌మైన ఎమోష‌న్స్‌తో అందమైన లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించాం. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య బంధాలు, అనుబంధాలు, ఆప్యాయత‌లు, అనురాగాల‌ను తెలియ జేసే చిత్రమిది. అలాంటి కంటెంట్‌ను సూచించేలాగానే ఈ రోజు విడుద‌లైన సాంగ్ `ఏమో ఏమో ఏ గుండెల్లో ..` ఉంది. త్వ‌ర‌లోనే మిగిలిన పాట‌ల‌ను, ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

చిత్ర సమర్పకులు శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యంగారు ఎక్స‌లెంట్‌గా పాడిన ఈ పాటకు రామ‌జోగయ్య‌గారు అమేజింగ్ లిరిక్స్ రాశారు. పాట‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. త్వ‌ర‌లోనే మ‌ర్నిన్ని లిరిక‌ల్ వీడియో పాట‌ల‌ను విడుద‌ల చేస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఈ చిత్రం రంజింపజేస్తుంది`` అన్నారు.

న‌టీన‌టులు: నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మెహ‌రీన్‌, వి.కె.న‌రేశ్‌, సుహాసిని,శరత్‌బాబు,త‌నికెళ్ల భ‌ర‌ణి, ప‌విత్రా లోకేశ్‌, రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల కిశోర్‌, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.