'ఎంత వరకు ఈ ప్రేమ' రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Tuesday,November 15 2016]

'రంగం' వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ 'కవలై వేండాం'. ఈ చిత్రాన్ని తెలుగులో 'ఎంత వరకు ఈ ప్రేమ' అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. 'యామిరుక్క బ‌య‌మేన్‌' ఫేమ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. తెలుగు, త‌మిళంలో సినిమాను న‌వంబ‌ర్ 24న విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా.....

డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ " తెలుగు ప్రేక్షకులకు రంగం వంటి సూపర్ హిట్ చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కల‌యిక‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ 'ఎంత‌వ‌ర‌కు ఈ ప్రేమ‌'. అవుటండ్ అవుట్ కామెడితో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే విధంగా ద‌ర్శ‌కుడు డీకే గారు సినిమాను అద్భుతంగా రూపొందించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన పాట‌లకు అల్రెడి తెలుగు, త‌మిళంలో మంచి రెస్పాన్స్ వ‌చ్చాయి. సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. సినిమాను న‌వంబ‌ర్ 24న తెలుగు, త‌మిళంలో గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. 'ఎంత వ‌ర‌కు ఈ ప్రేమ‌' మా డీవీ సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌కు మంచి పేరు తెచ్చే చిత్ర‌మ‌వుతుంది'' అన్నారు.

జీవా, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ సింహా, శృతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: టి.ఎస్.సురేష్, సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజమ్, మ్యూజిక్: లియోన్ జేమ్స్, నిర్మాత: డి.వెంకటేష్, దర్శకత్వం: డీకే.

More News

'చిత్రాంగద' హక్కులను దక్కించుకున్న....

వెంకట్ వాడపల్లి,టి.సి.యస్.రెడ్డి సమర్పణలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా బ్యానర్ పై అంజలి,దీపక్,సింధుతులాని ప్రధాన పాత్రధారులుగా

'నాన్న - నేను - నా బాయ్ ఫ్రెండ్స్ ' రిలీజ్ డేట్

ఆ అమ్మాయికి వాళ్ల నాన్నంటే ప్రాణం.తండ్రికి కూతురంటే ఆరోప్రాణం.పుట్టినప్పటి నుంచి పాదం కందకుండా పెంచుతాడు కుమార్తెను.

హీరో విశాల్ కు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్..!

తెలుగు,తమిళ్ చిత్రాల్లో నటిస్తూ మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న యంగ్ హీరో విశాల్.

సి.ఎం కెసిఆర్ ను క‌లిసిన నాగార్జున‌..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కెసిఆర్ ను హీరో అక్కినేని నాగార్జున ఈరోజు క‌లిసారు. నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ -  ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త జి.వి.కె మ‌న‌వ‌రాలు శ్రేయా భూపాల్ వివాహ నిశ్చితార్ధం డిసెంబర్ 9న హైద‌రాబాద్ లో జి.వి.కె హౌస్ లో ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది.

అది వాస్త‌వం కాదు అంటున్న త‌మ‌న్నా..!

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ప్ర‌స్తుతం విశాల్ స‌ర‌స‌న ఒక్క‌డొచ్చాడు చిత్రంలో న‌టిస్తుంది. సూర‌జ్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని హ‌రి తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 18న రిలీజ్ కానుంది.