ఈటల రాజేందర్ కు తృటిలో తప్పిన ప్రమాదం.. వేగంగా స్పందించిన పైలెట్

  • IndiaGlitz, [Tuesday,June 15 2021]

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన తన బృందంతో ఢిల్లీ నుంచి బయలుదేరుతున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. పైలెట్ గుర్తించడంతో ప్రమాదం తప్పింది. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ఈటల తన సన్నిహితులు, టీంతో కలసి సోమవారం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: సౌత్ నుంచి తొలి హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న సూపర్ స్టైలిష్ లుక్

అక్కడ ఢిల్లీ పెద్దల సమక్షంలో ఈటల బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. తిరిగి నేడు హైదరాబాద్ కు విమానంలో బయలుదేరారు. అయితే విమానం టేకాఫ్ అయ్యే సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. పైలెట్ లోపాన్ని గుర్తించి వేగంగా స్పందించారు. దీనితో ఈటల బృందానికి పెను ప్రమాదం తప్పినట్లయింది.

ఈటల బృందంతో పాటు 184 మంది ప్రయాణికులు ఆ విమానంలో ఉన్నారు. పైలెట్ అప్రమత్తతతో వందలాది ప్రాణాలు నిలిచాయి. ఈటల మరో ప్రత్యేక విమానంలో బయలుదేరినట్లు తెలుస్తోంది.

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో ఈటల బీజేపీలో చేరారు. టిఆర్ఎస్ పార్టీతో, కేసీఆర్ తో విభేదాలు తలెత్తడం.. భూ వివాదం నేపథ్యంలో ఈటల తనమంత్రి పదవి కోల్పోవడం జరిగింది. దీనితో ఈటల టిఆర్ఎస్ పార్టీ నుంచి తప్పుకున్నారు. తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. టిఆర్ఎస్ వర్సస్ ఈటల వ్యవహారంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.

More News

స్నేహానికి విలువిచ్చే అరుదైన వ్యక్తి.. స్టార్ డైరెక్టర్ కు ఎన్టీఆర్ బర్త్ డే విషెస్!

విజయవంతమైన చిత్రాలకు రచయితగా అనుభవం, దర్శకుడిగా కేవలం నాలుగు సినిమాలు.. నాలుగూ బ్లాక్ బస్టర్లే.

పిక్ టాక్ : కొండనైనా పండి చేసే కండలు.. యంగ్ హీరో సిక్స్ ప్యాక్ బాడీ వైరల్!

తన హార్డ్ వర్క్ తో యంగ్ హీరో నాగశౌర్య యువతలో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఊహలు గుసగుసలాడే, జ్యోఅచ్యుతానంద లాంటి సెన్సిబుల్ కథల్లో నటిస్తూనే ఛలో, అశ్వద్ధామ

సౌత్ నుంచి తొలి హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న సూపర్ స్టైలిష్ లుక్

విజయ్ దేవరకొండ క్రేజ్ పాన్ ఇండియా లెవల్ లో పెరుగుతోంది. అర్జున్ రెడ్డి చిత్రంతో సౌత్ మొత్తం విజయ్ వైపు చూసింది. బాలీవుడ్ లో కూడా ఆ మూవీ హాట్ టాపిక్ గా మారింది.

చిరంజీవి దంపతులని ప్రశంసించిన తెలంగాణ గవర్నర్

సేవకు నిలువెత్తు రూపం మెగాస్టార్ చిరంజీవి. తనని ఇంతటి వాడిని చేసిన ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని తపిస్తుంటారు చిరంజీవి. అందుకోసమే దశాబ్దాలుగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లతో సేవలు చేస్తున్నారు.

'పుష్ప' ఒక్కటే పది 'కేజిఎఫ్'లతో సమానం.. ఉప్పెన డైరెక్టర్ కామెంట్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' చిత్రంపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.