మరోసారి ప్రభుత్వంపై ఈటల పరోక్ష వ్యాఖ్యలు

మంత్రి ఈటల రాజేందర్ మరోసారి పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వంపై మాటల తూటాలు పేల్చారు. ఇటీవలి కాలంలో ఈటల రాజేందర్ సమయం దొరికినప్పుడల్లా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో ఒకసారి మంత్రి కేటీఆర్ తన కారులో ఈటలను తీసుకెళ్లి ఆయనతో కలిసి భోజనం చేసి కొంత కూల్ చేయడానికి యత్నించినట్టు తెలుస్తోంది. కానీ ఈటల మాత్రం వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది. తాజాగా రవీంద్రభారతిలో జరిగి బీసీ సమావేశంలో ఈటల చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని తెలుస్తోంది.

ఎలుకల బాధకు ఇంటిని తగులబెట్టుకోవద్దని ఈటల చెప్పారు. తాను రాజకీయాల గురించి మాట్లాడటం లేదంటూనే ఢిల్లీ రైతు బాధ ఏదో ఒక నాడు మీ గడప కూడా తొక్కుతుందంటూ సెటైర్లు వేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను మంత్రి కావొచ్చు, కానీ ముందుగా మనిషిని. మెరిట్ లేనిదే టీచర్ కారు. మెరిట్ లేనిదే మెడికల్ సీటు రాదు. పాలించే వాడికి కూడా మెరిట్ ఉండాలి. ఉద్యమాలు ప్రజల కోసం చేస్తే వారికి గొంతు కలపాలి. ప్రజల ఆకాంక్షల మేరకు మనం పనిచేయాలి. దేశ పౌరునిగా, సగటు మనిషిగా స్పందించాలి. ఎర్రకోట సాక్షిగా మన రాజ్యాంగం గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ అది సక్రమంగా అమలు కాలేదు. అందుకే మనం క్రిమిలేయర్ గురించి మాట్లాడుకుంటున్నాం.

సంపద కేంద్రీకృతమే పేదరికానికి కారణం. అంబానీ ఒక్కడి సంపద పెరిగితే పేదరికం పోదు. ఎలుకల బాధకు ఇంటిని తగలబెట్టుకోవద్దు. ఢిల్లీ రైతు బాధ ఏదో ఒక నాడు నీ గడప కూడా తొక్కుతుంది. రాజకీయాలు మాట్లాడట్లేను, రైతుల కోసం మాట్లాడుతున్నా. మన ఎన్నికల విధానం వల్ల ప్రజాప్రతినిధులను ఓట్లతో గెలిపిస్తున్నాం. అయితే ప్రజలు కోరుకోని విధానాలను పాలకులు విడనాడాలి. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో, వారి ఆకాంక్షలేమిటో గుర్తెరిగి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజల్లో చిచ్చు పెట్టే నిర్ణయాలు వద్దు. కొన్ని సార్లు మాలో చైతన్యం తగ్గిందని అనుకోవచ్చు. కానీ అవసరం వచ్చినప్పుడే అది మండుతుంది. ప్రజలే కేంద్రబిందువుగా, ప్రజలే ఇతివృత్తంగా ప్రభుత్వం మసలుకోవాలి’’ అని పేర్కొన్నారు.

More News

ఉబర్‌కు షాక్.. రూ.8 కోట్ల జరిమానా

ఉబర్‌కు భారీ షాక్ తగిలింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.8 కోట్ల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

'వివాహ భోజనంబు'లో రెండో పాట 'వాట్ ఏ మ్యాన్...' విడుదల

హాస్య నటుడు సత్య కథానాయకుడిగా నటించిన తొలి సినిమా 'వివాహ భోజనంబు'. అర్జావీ రాజ్ కథానాయిక.

పవన్ యాక్షన్‌లోకి దిగాడు..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ‘హరిహర వీరమల్లు’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో

పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి పవన్ 15 సినిమాలు..

సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లాలంటే బీభత్సమైన టాలెంట్‌తో పాటు.. కాస్తంత అదృష్టం కూడా ఉండాలి.

‘ఆర్ఆర్ఆర్’ సర్‌ప్రైజ్.. ఓ రేంజ్‌లో ఉంది..

దర్శకధీరుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.