నా చర్మం వలిచి చంద్రబాబుకు చెప్పులు కుట్టించినా..!

  • IndiaGlitz, [Saturday,January 12 2019]

‘నా చర్మం వలిచి సీఎం చంద్రబాబుకు చెప్పులు కుట్టించినా రుణం తీరదు’ అని ఏపీ నీటి పారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన దేవినేని ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోదావరి తల్లిని 180 కిలోమీటర్లు దాటించి పవిత్ర సంగమంలో, కృష్ణానదిలో కలిపిన అపర భగీరథుడు చంద్రబాబు అని మంత్రి చెప్పుకొచ్చారు. ఇదంతా ఓ చరిత్ర అని.. భావితరాలకు ఈ విషయాలను గుర్తుండిపోతాయని దేవినేని తెలిపారు. పవిత్ర సంగమం అనేది చంద్రబాబు మానసిక పుత్రిక అని.. ఐకాన్ బ్రిడ్జ్ 3.2 కిలోమీటర్లు నడిచి కూచిపూడి నృత్యం భంగిమలో నిర్మించడం జరుగుతుందన్నారు. ప్రపంచలోనే అత్యంత ఎత్తులో ఈ బ్రిడ్జ్‌‌ను నిర్మించబోతున్నామన్నారు.

గతంలో హరీశ్ కూడా ఇలాగే..!
గత ఏడాది ఎన్నికలకు ముందు సిద్దిపేటలోని గుర్రాలగొందిలో పర్యటించిన అప్పటి మంత్రి హరీశ్ కూడా ఇలాగే చర్మం, చెప్పులు అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈయనేం సీఎంను, మరెవరినో మెప్పుకోసం కాకుండా తనను ఆదరిస్తున్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీ ఊరికి పిలిపించి ఏకగ్రీవ తీర్మానం చేసి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చారు. మరోసారి ఎన్నికల బరిలోకి దిగిన నాపై పూర్తి విశ్వాసం చూపించి నా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచారు. ఎన్నికల ఖర్చుకు డబ్బులిచ్చి ఓట్లేసి గెలిపిస్తున్న గుర్రాలగొంది గ్రామస్తుల రుణం తీర్చుకోలేనిది. నా చర్మం ఒలిచి ప్రజలకు చెప్పులు కుట్టించినా రుణం తీరదు హరీశ్‌రావు భావోద్వేగానికి లోనయ్యారు. అయితే ఇది ప్రజలను ఉద్దేశించి అన్నారు కాబట్టి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.

అయితే.. దేవినేని వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ‘చర్మం, చెప్పులా..’ ఇదేంటి సారూ కొత్త కొత్త మాటలన్నీ మాట్లాడుతున్నారంటూ నెటిజన్లు, విమర్శకులు సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబును మరీ ఇంతలా ఆకాశానికెత్తడమేంటి..? ప్రశంసలు కురిపించడం చూశాము కానీ ఈ రేంజ్‌‌లో మాటలు మాట్లాడటం మిమ్మల్నే చూశాం ఉమా గారు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

More News

రానున్న ఎన్నికల్లో పోటీపై వైఎస్ విజయమ్మ క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌‌లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని టీడీపీ..

కేసీఆర్‌ను 'కట్టప్ప' వెన్నుపోటు పొడుస్తారా..!?

టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్, 2014, 2019 ఎన్నికల్లో గులాబీ పార్టీ గుబాలించడానికి కీలకపాత్ర పోషించిన వ్యక్తి, కల్వకుంట్ల కుటుంబానికి ఒక ‘కట్టప్ప’లా ఉన్న తన్నీరు హరీశ్ రావు

మహేష్‌తో బోయపాటి?

‘వినయ విధేయ రామ’ చిత్రంతో త‌ర్వాత‌ దర్శకుడు బోయపాటి శ్రీను..

అనుష్క సినిమాలో హాలీవుడ్ హీరో

హీరోయిన్‌గా చాలా గ్యాప్‌ తీసుకున్న అనుష్క తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతోంది.

పవన్ పొత్తు మాటల పై వైసీపీ రియాక్షన్

జనసేనతో పొత్తు కోసం వైసీపీ.. కొందరు టీఆర్ఎస్ నేతలతో మంతనాలు జరిపిస్తోందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉన్నట్టుండి శుక్రవారం రోజున బాంబుపేల్చిన సంగతి తెలిసిందే.