close
Choose your channels

జనసేనలో చేరిన మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

Sunday, March 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జనసేనలో ఇప్పటికే పలువురు మేధావులు, పెద్దలు చేరగా.. తాజాగా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు. ఆదివారం ఉదయం ఆయనకు కండువా కప్పి పవన్ కల్యాణ్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. భారీగా డబ్బులు ఖర్చుపెట్టకుండా ఎన్నికల్లో గెలవలేమన్న అభిప్రాయం ప్రస్తుతం నెలకొని ఉందన్నారు.

అయితే సొమ్ములతో పనిలేకుండానే రాజకీయం చేయొచ్చని నిరూపించే అవకాశం వచ్చిందన్నారు. పవన్ గురించి మాట్లాడిన ఆయన.. ఓ ప్రొఫెసర్‌లో జ్ఞానం ఉంటుంది.. మరికొందరిలో ఆత్మ విశ్వాసం ఉంటుంది.. ఇంకొందరికి జనాదరణ ఉంటుంది.. ఈ మూడు లక్షణాలను పుణికిపుచ్చుకున్న వ్యక్తి పవన్ కల్యాణ్ అని జేడీ ప్రశంసలు కురిపించారు. కాగా.. శనివారం అర్ధరాత్రి పవన్-మాజీ జేడీ ఇద్దరూ నిశితంగా చర్చించారు. అనంతరం పార్టీలో చేరాలని నిర్ణయించిన ఆయన ఆదివారం ఉదయం కండువా కప్పుకున్నారు.

వచ్చే ఐదేళ్లలో...

"ఒక మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో పవన్ జనసేన స్థాపించారు. సమసమాజ నిర్మాణం కోసం మా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఆనాడు కుటుంబ సమస్యలు కారణంగా కుదరలేదు. ఈ రోజు కలిసి పని చేసే అవకాశం కలిగింది. భారత దేశం యువతరంతో ఉత్సాహంగా ఉంది. వచ్చే ఐదేళ్లలో వారికి మార్గం‌ చూపితే దేశం రూపురేఖలే మారిపోతాయి. మార్పు తెచ్చే నేత పవన్ కళ్యాణ్.

పవన్ మ్యానిఫెస్టో కూడా చాలా‌ బాగుంది. అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉంది

ఇటువంటి మ్యానిఫెస్టో రూపొందించాలంటే ఎంతో సాధన చేసి ఉండాలి. డబ్బులు లేకుండా రాజకీయం జరగదన్న నేటి రోజుల్లో మార్పులు కోసం‌ వచ్చారు. జ్ఞాన సంపద, ధైర్యం, ప్రజాదరణ.. ,మూడు లక్షణాలు పవన్ లో ఉన్నాయి" అని ఆయన చెప్పుకొచ్చారు.

విమర్శలపై...

"నేను ఈరోజు నుంచి జనసైనికునిగా ఉంటాను. సరికొత్త మార్పు కోసమే నేను జనసేనలో చేరాను.

ఈ రోజు సాయంత్రానికి నేను ఎక్కడి నుంచి పోటీ చేసేది పవన్ ప్రకటిస్తారు. వామపక్షాలు, బీస్పీలతో పొత్తుల కారణంగా జనసేన జనంలోకి మరింత వెళుతుంది. నేను టీడీపీలో‌ చేరుతున్నట్లుగా వచ్చిన వార్తలు మీడియా సృష్టే.

వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు రెండు‌ వందల శాతం అబద్దం.నా వృత్తిని ఎలా నిర్వహించానో నా అంతరాత్మకు తెలుసు" అని లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.