కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప ఇంట్లో విషాదం.. మనుమరాలు ఆత్మహత్య

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. యడ్డీ మనుమరాలు సౌందర్య (30) బెంగళూరులోని ఆమె నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. యడియూరప్ప రెండో కుమార్తె పద్మావతి కూతురే సౌందర్య . ఆమె భర్తతో కలిసి బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్నారు.

డాక్టర్ సౌందర్యకు, జిల్లా పంచాయితీ సభ్యుడు మరిస్వామి అన్న కుమారుడు డాక్టర్ నీరజ్‌కు 2018 లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఓ పాప ఉంది. బెంగళూరు నగరంలోని వసంతనగర్ లోని మౌంట్ కార్మల్ అపార్ట్ మెంట్ లో డాక్టర్ నీరజ్, సౌందర్య దంపతులు నివసిస్తున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో డాక్టర్ నీరజ్ విధి నిర్వహణలో భాగంగా ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి వెళ్లారు. ఆ సమయంలో సౌందర్య ఇంట్లోనే ఉన్నారు.

భర్త బయటకు వెళ్లిపోయిన తర్వాత తన గదికి వెళ్లిన సౌందర్య తలుపు వేసుకుంది. అల్పాహారం ఇచ్చేందుకు పనిమనిషి డోర్‌ కొట్టగా.. ఎంతకూ తలుపు తీయకపోవటంతో ఆమె నీరజ్‌కు సమాచారం అందించింది. దీంతో పరుగు పరుగున ఇంటికి వచ్చిన నీరజ్ తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా సౌందర్య ఉరికి వేలాడుతూ కన్పించింది. వెంటనే ఆమెను దగ్గర్లోని మల్లిగే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

హైగ్రౌండ్స్ పోలీసులు సంఘటనా స్థానికి చేరుకుని పరిశీలించారు. సౌందర్య మృతదేహాన్ని శివాజీనగర్ లోని బౌరింగ్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మై, పలువురు సీనియర్ మంత్రులు ఆసుపత్రికి చేరుకుని యడ్డీ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అబ్బిగెరెలో వున్న నీరజ్ ఫామ్‌ హౌజ్‌‌లో సౌందర్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తీవ్ర మానసిక ఒత్తిడి వల్లనే సౌందర్య ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

More News

దక్షిణాఫ్రికాలో మ‌రో డేంజ‌ర‌స్ వైర‌స్: కరోనా కొత్త రూపం 'నియోకోవ్'.. సోకితే ప్ర‌తి ముగ్గురిలో ఒక‌రు మృతి

2019 చివరిలో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న సంగతి తెలిసిందే.

సలార్‌లో శృతిహాసన్‌ క్యారెక్టర్‌కు పవన్ కుమార్తె పేరు.. పోస్టర్ రిలీజ్ చేసిన యూనిట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ శృతిహాసన్ జంటగా నటిస్తున్న తొలి సినిమా 'సలార్'. 'కె.జి.యఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.

అవినీతిపై యుద్ధం .. సామాజిక కోణంలో శ్రీవిష్ణు ‘‘భళా తందనాన’’ , ఆకట్టుకుంటున్న టీజర్‌

హిట్టు ఫ్లాఫ్‌తో సంబంధం లేకుండా కొత్తదనం వున్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వుంటారు యువ కథానాయకుడు శ్రీవిష్ణు.

సమంత-నాగచైతన్య విడాకులపై నేనేం మాట్లాడలేదు.. అదంతా అవాస్తవం: నాగార్జున ట్వీట్

సమంత-నాగచైతన్యల విడాకులకు సంబంధించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అగ్ర కథానాయకుడు నాగార్జున స్పష్టం చేశారు.

69 ఏళ్ల తర్వాత పుట్టింటికి ఎయిరిండియా.. టాటా గ్రూప్‌కు అప్పగించిన కేంద్రం

ఇప్పటి వరకు ప్రభుత్వరంగంలో సేవలందించిన దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియా 69 ఏళ్ల తర్వాత పుట్టింటికి చేరుకుంది.