close
Choose your channels

ఎన్నికల ముందు టీఆర్ఎస్‌కు ఊహించని షాక్..!?

Saturday, January 11, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎన్నికల ముందు టీఆర్ఎస్‌కు ఊహించని షాక్..!?

కరీంనగర్: ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ వరుస షాక్‌లు తగులుతున్నాయ్. ఓ వైపు టికెట్ల కోసం అభ్యర్థులు గొడవ.. మరోవైపు టికెట్లు దక్కలేదని నేతలు పార్టీ మారుతున్నారు. దీంతో అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్‌కు పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌కు షాకిచ్చేందుకు మంత్రి గంగుల కమలాకర్‌ ప్రధాన అనుచరుడిగా, కరీంనగర్‌ మేయర్‌గా పనిచేసిన రవీంద్రసింగ్‌ సిద్ధమైనట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

చేర్చుకోవాలా..? వద్దా..!?

టీఆర్ఎస్‌కు టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకోవాలని మాజీ మేయర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం నుంచి రవీంద్రసింగ్‌తో బీజేపీ ఎంపీ బండి సంజయ్ చర్చలు జరుపుతున్నారని తెలిసింది. పార్టీలోకి తీసుకురావాలా? వద్దా..? అనేదానిపై పార్టీ సీనియర్ నేతలతో బండి మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి చెందిన ముఖ్య, సీనియర్ నాయకులతో బండి టచ్ ఉన్న సంగతి తెలిసిందే.

ఇదే జరిగితే..!
కాగా.. మంత్రి గంగులతో విబేధాలు తలెత్తడంతో మాజీ మేయర్ బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఆయన్ను పార్టీలో చేర్చుకుని బీజేపీ తరఫున మేయర్ అభ్యర్థిగా బరిలోకి దింపాలని కమలనాథులు భావిస్తు్న్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే కరీంనగర్‌ కార్పొరేషన్‌లో రాజకీయ సమీకరణాలు మారతాయని స్థానిక నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే గంగులతో విబేధాల కారణంగా టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ వేణు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. ఎంపీ బండి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.