close
Choose your channels

బ్రేకింగ్: కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి

Saturday, August 8, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. ప్రముఖ రాజకీయ నేతలు సైతం కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నంది ఎల్లయ్య కరోనాతో మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 10:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. పది రోజుల క్రితం కరోనా లక్షణాలతో బాధ పడుతున్న ఆయన పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

జులై 29న ఆయన చికిత్స నిమిత్తం పంజాగుట్టలోని నిమ్స్‌ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. పదిరోజుల చికిత్స అనంతరం నేడు ఆయన తుదిశ్వాస విడిచారు. నంది ఎల్లయ్య 1942 జూలై 1న హైదరాబాద్‌లోని బోలక్‌పూర్‌లో జన్మించారు. లోక్‌సభ ఎంపీగా ఆరు సార్లు విజయం సాధించగా... ఒకసారి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం ఆయన పార్టీకి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. నంది ఎల్లయ్య మరణ వార్తను తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.