దేశవ్యాప్తంగా 61లక్షలు దాటిన కరోనా కేసులు.. భారీగా తగ్గిన మరణాలు..
Send us your feedback to audioarticles@vaarta.com
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. అయితే అదే స్థాయిలో కోలుకుంటున్న వారి సంఖ్య సైతం నమోదు కావడం కాస్త ఊరటనిస్తోంది. కాగా కరోనా హెల్త్ బులిటెన్ను మంగళవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 61లక్షలు దాటింది. అయితే గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70,589కు చేరుకుంది. గత నెల రోజుల్లో 70 వేల కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 61, 45, 292 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కాగా దేశంలో కరోనా మరణాల సంఖ్య భారీగా తగ్గింది. ఆగస్ట్ 4 నుంచి ఇప్పటి వరకూ కరోనా మరణాల సంఖ్య 8 వందలకు తగ్గింది లేదు. కానీ తాజాగా 8 వందల లోపు నమోదవడం గమనార్హం. గడచిన 24 గంటల్లో 776 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 9,47,576 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి ఇప్పటి వరకు 51,01,398 మంది బాధితులు కోలుకున్నారు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 96, 318 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 84, 877 మంది బాధితులు కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 83.01% ఉండగా.. మరణాల రేటు 1.57%గా ఉంది.
కాగా దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 11,42,811 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకూ 7 కోట్ల 31 లక్షల టెస్టులు పూర్తి చేసినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. కాగా వీకెండ్లో తక్కువ పరీక్షలు నిర్వహించిన కారణంగానే పాజిటివ్ కేసులు తక్కువగా బయటపడినట్టు తెలుస్తోంది. ఆదివారం కేవలం 7 లక్షల పరీక్షలను మాత్రమే నిర్వహించారు. మరణాల సంఖ్య మహారాష్ట్రలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే నిన్న ఆ సంఖ్య భారీగా తగ్గిపోవడం గమనార్హం. ప్రతిరోజూ 400 మరణాలు సంభవిస్తుండగా.. గడిచిన 24 గంటల్లో 180 మరణాలు నమోదయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.