సుశాంత్ సినిమాలో చైతు, అఖిల్ రోల్స్ గురించి ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..!

  • IndiaGlitz, [Wednesday,August 17 2016]

సుశాంత్ న‌టించిన తాజా చిత్రం ఆటాడుకుందాం..రా. ఈ చిత్రాన్ని జి.నాగేశ్వ‌ర‌రెడ్డి తెర‌కెక్కించారు. శ్రీనాగ్ కార్పోరేష‌న్ & శ్రీజి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్ పై చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు, ఎ.నాగ సుశీల సంయుక్తంగా నిర్మించారు. ఆల్ ఆడియోన్స్ ను ఎట్రాక్ట్ చేసే ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఆటాడుకుందాం రా చిత్రాన్ని ఈనెల 19న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగ చైత‌న్య‌, అఖిల్ గెస్ట్ రోల్ చేస్తున్న విష‌యం తెలిసిందే.
ఇక చైత‌న్య‌, అఖిల్ రోల్స్ గురించి ఎక్స్ క్లూజివ్ డీటైల్స్ ఏమిటంటే....నాగ చైత‌న్య ఈ చిత్రంలో క‌థ‌ను మ‌లుపు తిప్పే కీల‌క పాత్ర పోషించారు. చైత‌న్య రోల్ ఫ‌స్టాఫ్ లో వ‌స్తే...అఖిల్ సెకండాఫ్ లో ప్రేక్ష‌క‌లు ముందుకు రానున్నాడు. మ‌రో విష‌యం ఏమిటంటే...రియ‌ల్ లైఫ్ లో సుశాంత్ & చైత‌న్య‌, అఖిల్ మ‌ధ్య ఉన్న రిలేష‌న్ షిప్ గురించి తెలిసిందే. అయితే సినిమాలో మాత్రం వీరికి ఏ రిలేష‌న్ ఉండ‌దు. అఖిల్ సుశాంత్ క‌లిసే చేసే డ్యాన్స్ మూమెంట్ ఒక నిమిషం పైనే ఉంటుంది. ఒకే సినిమాలో అక్కినేని హీరో్ల‌ను చూడ‌డం అంటే ఫ్యాన్స్ కు పండ‌గే. మరి...ఫ్యాన్స్ ను విశేషంగా ఆక‌ట్టుకునే ఆటాడుకుందాం రా ఏరేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో చూడాలి.

More News

మ‌హేష్ మూవీ లేటెస్ట్ అప్ డేట్..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో భారీ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్ లో ఎన్.వి.ప్ర‌సాద్, ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

జ‌న‌తా గ్యారేజ్ మ‌ల‌యాళ వెర్షెన్ ఆడియో రిలీజ్ డేట్..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్ లో రూపొందుతున్న భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఆటాడుకుందాం రా ఒక పండ‌గ లాంటి సినిమా - చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు

కాళిదాసు, క‌రెంట్, అడ్డా...చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ న‌టించిన లేటెస్ట్ మూవీ ఆటాడుకుందాం రా. జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు, ఎ.నాగ సుశీల సంయుక్తంగా నిర్మించారు.

శర్వానంద్ 25వ సినిమా ఓవర్ సీస్ హక్కులను

రన్‌రాజారన్‌, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, ఎక్స్‌ప్రెస్‌ రాజా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో హ్యాట్రిక్‌ సాధించిన హీరో శర్వానంద్‌ కథానాయకుడిగా, భలే భలే మగాడివోయ్‌, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి కథానాయికగా, ఛత్రపతి, డార్లింగ్‌, అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన భా

'ధృవ' టైటిల్ వెనుక ర‌హ‌స్యమ‌దేనా..?

మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తున్న చిత్రం `ధృవ‌`. `మై ఎనిమి ఈజ్ మై స్ట్రెంగ్త్` అనే ట్యాగ్ లైన్‌తో సినిమా రూపొందుతోంది. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లు అర‌వింద్‌, ఎన్‌.వి.ప్ర‌సాద్ నిర్మాత‌లుగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రానున్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ఆగ‌స్ట్ 15న విడుద‌లైంది.