పెట్రోల్ బాంబు మంటల్లో గాయపడిన ప్రముఖ హీరో

  • IndiaGlitz, [Tuesday,March 02 2021]

ప్రముఖ హీరో షూటింగ్‌లో గాయపడిన ఘటన ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. ఓ సన్నివేశం చిత్రీకరణలో భాగంగా పెట్రోల్ బాంబు విసిరి వేయాల్సి ఉంది. అది విసిరి వేయగానే హీరో పాటు మరో నటుడు పరిగెత్తాల్సి ఉంటుంది. అయితే ఈలోపే ప్రమాదం జరిగిపోయింది. అయితే బాంబు విసిరి పరిగెత్తే లోపు మంటలు అంటుకుని హీరో గాయపడినట్టు తెలుస్తోంది. దీంతో చిత్ర యూనిట్ మొత్తం కంగారు పడింది. అయితే ఇది తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఘటన కాదులెండి.

కన్నడ సినిమా షూటింగ్‌లో భాగంగా ఈ ప్రమాదం జరిగింది. ప్రముఖ కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి హీరోగా ‘హీరో’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగులో పెట్రోలు బాంబు విసిరే సీన్ ఉంటుంది. ఈ సీనే ప్రమాదానికి కారణమైంది. ఇటీవల హాసన్‌ జిల్లా బేలూరులో పోరాట దృశ్యాల చిత్రీకరణలో ఈ ఘటన జరిగింది. స్క్రిప్ట్‌ ప్రకారం పెట్రోల్‌ బాంబు విసిరి నటులు రిషబ్, గానావి లక్ష్మణ పరారీ కావాల్సి ఉంటుంది. అయితే బాంబు విసిరి పరిగెత్తే లోపు మంటలు అంటుకుని రిషబ్ గాయపడినట్లు సమాచారం.

More News

'ఏ1 ఎక్స్‌ప్రెస్'ను నిజానికి 40 రోజుల్లో తీశాం: సందీప్ కిషన్

హీరో సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న 25వ చిత్రం 'ఏ1 ఎక్స్‌ప్రెస్'. డెన్నిస్‌ జీవన్‌  కనుకొలను దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది.

చేతిలో బీర్ బాటిల్‌తో డ్రైవింగ్.. నలుగురి మృతి

మద్యం మత్తులో కారు నడిపి నలుగురి చావుకు కారణమయ్యాడో వ్యక్తి. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం అమ్మవారిపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

గృహ రుణం తీసుకోవాలనుకుంటున్న వారికి ఎస్‌బీఐ గుడ్ న్యూస్

గృహ రుణం తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ న్యూస్ కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

‘సారంగదరియా’ ఎంత హైపో.. అంతే విమర్శలు..

యూట్యూబ్ సెన్సేషన్.. రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే లక్షల్లో వ్యూస్.. లక్షల్లో లైక్స్.. తెలంగాణ పల్లె నుంచి పుట్టిన పురాతన ట్యూన్..

సుధీర్ బాబు, మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేష‌న్లో మూడో చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'

'సమ్మోహనం', 'వి' తర్వాత హీరో సుధీర్ బాబు, ద‌ర్శ‌కుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేష‌న్లో మూడో చిత్రం రూపోందుతోంది.