close
Choose your channels

రష్మిక కోసం 900 కిమీ ప్రయాణించి.. చివరకు పోలీసులకు చిక్కి..!

Thursday, June 24, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రష్మిక కోసం 900 కిమీ ప్రయాణించి.. చివరకు పోలీసులకు చిక్కి..!

తమ అభిమాన తారల కోసం అభిమానులు ఎంతకైనా తెగిస్తారు అనడానికి ఇదొక నిదర్శనం. గతంలో హీరోల కోసం అభిమానులు చాలా దూరం ప్రయాణించిన సంఘటనలు చూశాం. సినీతారలు కనిపిస్తే చాలా అభిమానులు సెల్ఫీలు, ఫోటోల కోసం ఎగబడుతుంటారు. సినీ తారల్ని చూసి తెలియని సంతోషం పొందుతుంటారు.

ఇదీ చదవండి: హైదరాబాద్ లో నేడు పునః ప్రారంభమైన 'సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రాలు 'వరుడు కావలెను‘, 'నరుడి బ్రతుకు నటన'

తాజాగా క్రేజీ బ్యూటీ రష్మిక మందన కోసం ఓ అభిమాని 900 కిమీ ప్రయాణించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణకు చెందిన ఆకాష్ త్రిపాఠి అనే యువకుడు రష్మికకు వీరాభిమాని. నేరుగా రష్మికని చూసి, ఆమెతో మాట్లాడాలనేది అతడి కోరిక.

రష్మిక కోసం 900 కిమీ ప్రయాణించి.. చివరకు పోలీసులకు చిక్కి..!

దీనితో తెలంగాణ నుంచి రష్మిక ఇంటికి ప్రయత్నించాలని ఆకాష్ డిసైడ్ అయ్యాడు. ఆమె ఇంటి అడ్రెస్ తెలుసుకుని మైసూర్ కు ట్రైన్ లో వెళ్ళాడు. అక్కడి నుంచి కార్గో ఆటోలో రష్మిక ఇల్లు ఉందని భావిస్తున్న కొడగులోని విరాజ్ పెట్ ప్రాంతానికి చేరుకున్నాడు.

అక్కడ రష్మిక ఇల్లు ఎక్కడని కనిపించిన వారందరిని అడగడం ప్రారంభించాడు. దీనితో అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని భావించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతడిని విచారించగా రష్మికకు వీరాభిమాని అని అర్థం అయింది.

రష్మిక ప్రస్తుతం ఇక్కడ లేదని షూటింగ్ కోసం ముంబై వెళ్లిందని పోలీసులు ఆకాష్ కు నచ్చజెప్పారు. తిరిగి అతడిని తెలంగాణకు పంపారు. ఇటీవల ఓ అభిమాని సోనూ సూద్ కోసం కాలినడకన తెలంగాణ నుంచి ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.