రష్మిక కోసం 900 కిమీ ప్రయాణించి.. చివరకు పోలీసులకు చిక్కి..!

  • IndiaGlitz, [Thursday,June 24 2021]

తమ అభిమాన తారల కోసం అభిమానులు ఎంతకైనా తెగిస్తారు అనడానికి ఇదొక నిదర్శనం. గతంలో హీరోల కోసం అభిమానులు చాలా దూరం ప్రయాణించిన సంఘటనలు చూశాం. సినీతారలు కనిపిస్తే చాలా అభిమానులు సెల్ఫీలు, ఫోటోల కోసం ఎగబడుతుంటారు. సినీ తారల్ని చూసి తెలియని సంతోషం పొందుతుంటారు.

ఇదీ చదవండి: హైదరాబాద్ లో నేడు పునః ప్రారంభమైన 'సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రాలు 'వరుడు కావలెను‘, 'నరుడి బ్రతుకు నటన'

తాజాగా క్రేజీ బ్యూటీ రష్మిక మందన కోసం ఓ అభిమాని 900 కిమీ ప్రయాణించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణకు చెందిన ఆకాష్ త్రిపాఠి అనే యువకుడు రష్మికకు వీరాభిమాని. నేరుగా రష్మికని చూసి, ఆమెతో మాట్లాడాలనేది అతడి కోరిక.

దీనితో తెలంగాణ నుంచి రష్మిక ఇంటికి ప్రయత్నించాలని ఆకాష్ డిసైడ్ అయ్యాడు. ఆమె ఇంటి అడ్రెస్ తెలుసుకుని మైసూర్ కు ట్రైన్ లో వెళ్ళాడు. అక్కడి నుంచి కార్గో ఆటోలో రష్మిక ఇల్లు ఉందని భావిస్తున్న కొడగులోని విరాజ్ పెట్ ప్రాంతానికి చేరుకున్నాడు.

అక్కడ రష్మిక ఇల్లు ఎక్కడని కనిపించిన వారందరిని అడగడం ప్రారంభించాడు. దీనితో అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని భావించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతడిని విచారించగా రష్మికకు వీరాభిమాని అని అర్థం అయింది.

రష్మిక ప్రస్తుతం ఇక్కడ లేదని షూటింగ్ కోసం ముంబై వెళ్లిందని పోలీసులు ఆకాష్ కు నచ్చజెప్పారు. తిరిగి అతడిని తెలంగాణకు పంపారు. ఇటీవల ఓ అభిమాని సోనూ సూద్ కోసం కాలినడకన తెలంగాణ నుంచి ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే.

More News

హైదరాబాద్ లో నేడు పునః ప్రారంభమైన 'సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రాలు 'వరుడు కావలెను‘, 'నరుడి బ్రతుకు నటన'

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా

ఊహించని ట్విస్ట్ తో అడ్డంగా బుక్కైన జ్యోతిష్కుడు.. రూ.17 కోట్ల నకిలీ దందా!

తన ఇంట్లో పెద్ద చోరీ జరిగిపోయినట్లు బిల్డప్ ఇచ్చిన జ్యోతిష్కుడు అడ్డంగా పోలీసులకు బుక్కయ్యాడు.

చిరంజీవికి సీఎం జగన్ కృతజ్ఞతలు.. క్రెడిట్ వారిదే!

ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరోజులో 13 లక్షల మందికి పైగా రికార్డ్ స్థాయిలో వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించినందుకు గానూ జగన్ ప్రభత్వంపై ప్రశంసలు దక్కుతున్నాయి.

సీత పాత్ర కోసం ఫైర్ బ్రాండ్ లేడీని రికమండ్ చేస్తున్న విజయేంద్ర ప్రసాద్ ?

రాబోవు రోజుల్లో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పురాణ గాధ నేపథ్యం ఉన్న చిత్రాలతో కళకళలాడబోతోంది. తెలుగు దర్శకుడు గుణశేఖర్ ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రభాస్ శ్రీ రాముడిగా ఆదిపురుష్ లో నటిస్తున్నాడు.

నాని వల్ల 5 సార్లు ఏడ్చా.. బాలీవుడ్ స్టార్ కామెంట్స్!

నేచురల్ స్టార్ నాని.. ఎమోషన్, కామెడీ, రొమాన్స్ ఇలా ఎలాంటి వేరియేషన్ తో అయినా ప్రేక్షకులని కట్టి పడేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే నాని నటనకు అంతటి క్రేజ్ ఉంది