నిధి అగ‌ర్వాల్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన అభిమానులు

  • IndiaGlitz, [Monday,February 15 2021]

అభిమానం విప‌రీతానికి చేరుకుంటే ఏమంటారు?.. పిచ్చి అనే అంటారు. కానీ ఇత‌రుల‌కు న‌ష్టం క‌లిగించనంత వ‌ర‌కు ఎవ‌రి పిచ్చి వారికి ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు త‌మిళ‌నాడులో కొంద‌రు ఇలాగే అంటున్నారు. మా పిచ్చి మాకు ఆనందం అంటున్నారు. ఇంత‌కీ అలా అంటున్న వారెవ‌రో తెలుసా? నిధి అగ‌ర్వాల్ అభిమానులు. వివ‌రాల్లోకి వెళితే.. వేలంటైన్స్ డే సంద‌ర్భంగా అంద‌రూ ప్రేమికులు త‌మ ప్రేమ‌ను వ్య‌క్తం చేసుకున్నారు. అయితే త‌మిళ‌నాడులో కొంద‌రు త‌మ అభిమాన న‌టి నిధి అగ‌ర్వాల్‌కు వేలంటైన్స్ డే సంద‌ర్భంగా చెన్నైలోని కోడంబాక్కంలోని కొంద‌రు అభిమానులు గుడి క‌ట్టి పాలాభిషేకాలు చేసిన పూజలు నిర్వ‌హించారు. అస‌లు నిధి అగ‌ర్వాల్‌కు త‌మిళ‌నాడులో అంత మంది అభిమానులు ఎలా వ‌చ్చారు? అనే సందేహం రాక‌మాన‌దు. అయితేనేం.. ఎవ‌రి పిచ్చి వారికి ఆనందం. అభిమానానికి హ‌ద్దులు ఉండ‌వు.

మున్నా మైకేల్ అనే బాలీవుడ్ మూవీతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన నిధి అగ‌ర్వాల్ త‌ర్వాత తెలుగులో మిస్ట‌ర్ మ‌జ్ను, స‌వ్య‌సాచి, ఇస్మార్ట్ శంక‌ర్ వంటి తెలుగు చిత్రాల‌తో పాటు, భూమి, ఈశ్వ‌ర‌న్ వంటి త‌మిళ చిత్రాల్లోనూ న‌టించి త‌న‌దైన గుర్తింపును సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా క్రిష్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తోంది నిధి అగ‌ర్వాల్‌.

More News

మెగాస్టార్‌తో పాటు మహేష్, ఎన్టీఆర్‌లను బీట్ చేసిన వైష్ణవ్?

మెగా హీరో వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే అదరగొడుతున్నాడు. ఈ నెల 12న విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుంచే వసూళ్ల ‘ఉప్పెన’ సాగిస్తోంది.

తండ్రి సెంటిమెంటే ఆయుధంగా ముందుకు సాగుతున్న షర్మిల..

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయురాలు షర్మిల తెలంగాణ పాలిటిక్స్‌లో మరింత యాక్టివ్ అవుతున్నారు.

'క‌ప‌ట‌ధారి' థీమ్ ట్రైల‌ర్ విడుద‌ల‌

ఆర్కియాల‌జీలో ఎప్పుడో జ‌రిగిన హ‌త్య‌... హంత‌కుడు ఎవ‌రో తెలియ‌దు. పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా అంతు ప‌ట్ట‌ని ఆ హంత‌కుడు ర‌హ‌స్యాన్ని

మొన్న అరకు.. నిన్న కర్నూలు.. నేడు మహారాష్ట్ర.. అన్నీ ఘోరాలే..!

ఇటీవలి కాలంలో దేశంలో వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న అరకులో మినీ బస్సు 100 అడుగులో పడిపోయిన విషయం మరువక ముందే..

ఏపీలో మళ్లీ ఎన్నికల సమరం.. ఈసారి ఏం జరగనుందో?

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు రీ నోటిఫికేషన్ విడుదలైంది. మార్చిన 10న ఈ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్టు వెల్లడిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్