close
Choose your channels

ఫాంటసీ కథాంశంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసేందుకు త్రినయని సీరియల్‌తో మీ ముందుకు వస్తోన్న జీ తెలుగు

Thursday, February 27, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఫాంటసీ కథాంశంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసేందుకు త్రినయని సీరియల్‌తో మీ ముందుకు వస్తోన్న జీ తెలుగు

అద్భుతమైన కథలు, అత్యద్భుతమైన సీరియల్స్‌, అంతకుమించిన రియాలిటీ షోస్‌తో తెలుగు ప్రేక్షకుల్ని జీ తెలుగు నాన్‌స్టాప్‌గా ఎంటర్‌టైన్‌ చేస్తోంది. ఇప్పటికే ఎన్నో సూపర్‌హిట్‌ సీరియల్స్‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేసిన జీ తెలుగు.. ఇప్పుడు ఫాంటసీ కథాంశంతో మీ ముందుకు వస్తోంది. సరికొత్తగా త్రినయని అనే సీరియల్‌ని త్వరలో ప్రసారం చేయబోతోంది. సాధారణ జీవితాన్ని గడిపే ఒక అమ్మాయికి.. గతంతో పాటు భవిష్యత్‌ కూడా ముందే తెలిస్తే? అది ఆ అమ్మాయికి వరమా, శాపమా? ఈ అద్భుతమైన పాయింట్‌తో మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయబోతుంది. త్రినయని సీరియల్‌ మార్చి 2, 2020, సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8.30లకు జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ ఛానల్స్‌లలో ప్రసారం కాబోతుంది.

అతేంద్రీయ శక్తులు, వాటి తాలూకూ సంఘటనలు ప్రేక్షకుల్ని ఎప్పుడు మెస్మరైజ్‌ చేస్తూనే ఉంటాయి. ప్రతీ పాత్ర, ప్రతీ సంఘటన ఆసక్తి కలుగచేస్తుంది. అందుకే ఈసారి ఇలాంటి కథపై ఫోకస్ పెట్టింది జీ తెలుగు. అందులో భాగంగా త్రినయని సీరియల్‌ని తెరకెక్కించింది. ఇందులో ఉండే ప్రతీ మలుపు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతుంది.

ఒక విలక్షణమైన కాన్సెప్ట్‌ వీడియో కోసం సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు జీ తెలుగుతో చేతులు కలిపారు. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సీరియల్‌ కాన్సెప్ట్‌ను ప్రేక్షకులకు తనదైన స్టైల్లో వివరించారు. ఎనర్జిటిక్‌ యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు, త్రినయని పాత్రలో నటించిన ఆషిక గోపాల్‌ పదుకునే ఈ వీడియోలో సూపర్‌స్టార్‌ మహేశ్‌తో కన్పించారు.

ముక్కంటిపురం అనే కల్పితమైన పల్లెటూర్లో త్రినయని కథ ప్రారంభం అవుతుంది. ఈ సీరియల్‌ కోసం అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్‌ని ఉపయోగించారు. ఇక ఇందులో బిజినెస్‌ మాన్ విశాల్‌ వర్మ పాత్రలో చందు గౌడ నటించాడు. ఎదుటివారి భవిష్యత్తుని చూడగలిగే తన శక్తిని సమాజహితం కోసం ఉపయోగించాలని అనుకునే అమ్మాయి త్రినయని పాత్రలో ఆషికా నటించింది.

ఈ సందర్భంగా ఆషికా గోపాల్‌ పదుకునే మాట్లాడుతూ.. “నాకు ఈ పాత్ర చాలా బాగా నచ్చింది. ఇందులో చాలా డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్నాయి. ఈ సీరియల్‌ ద్వారా అందరికి ఒక్క సరికొత్త రూపంలో కనిపించబోతున్నా. ఈ క్యారెక్టర్‌ ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను.”

ఈ సందర్భంగా చందు గౌడ మాట్లాడుతూ.. “ఈ జానర్‌ నాకు పూర్తిగా కొత్తది. నేను ఈ షోలో భాగం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీలో నేను కూడా ఒక భాగం అవ్వాలని అనుకుంటున్నాను. అందుకు మీ అందరి ఆశీస్సులు కావాలి.”

అద్భుతమైన కథ, అంతకుమించిన స్క్రీన్‌ప్లే, విజువల్‌ ఎఫెక్ట్స్ తో రూపొందించిన త్రినయని అందరిముందుకు రాబోతుంది. ఈ సీరియల్‌ ప్రారంభం అయిన తర్వాత ప్రతీ ఒక్కరూ.. తర్వాత ఏం జరగబోతోంది, నెక్స్ట్ ఎపిసోడ్‌ ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ కలుగుతుంది. ఇందులో ఉన్న ప్రతీ పాత్ర మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

సూపర్‌ థ్రిల్లర్‌ సీరియల్ త్రినయని .. మార్చి 2, 2020 సోమవారం నుంచి శనివారం వరకు ప్రతీ రోజూ రాత్రి 8.30లకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ ఛానల్స్ లలో. సో.. డోంట్‌మిస్‌ ద థ్రిల్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.