close
Choose your channels

రైతులారా బాబును నమ్మొద్దు... మీకు న్యాయం చేసేది జగనే : తలసాని

Thursday, January 16, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రైతులారా బాబును నమ్మొద్దు... మీకు న్యాయం చేసేది జగనే : తలసాని

ఏపీ రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఏలూరు లో కోడి పందేలను చూసేందుకు వెళ్ళిన ఆయన... గత ప్రభుత్వ పొరపాట్ల వల్లనే రాజధాని సమస్య తలెత్తిందని అభిప్రాయ పడ్డారు. రాజధాని విషయం పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినదని.... శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

రాజధాని రైతులు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం అన్న తలసాని.... సీఎం జగన్ తో చర్చిస్తే కచ్చితంగా న్యాయం చేస్తారన్నారు. ఇక మాజీ సీఎం చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు తలసాని. జోల పట్టుకుని భిక్షం ఎత్తే నేతలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. బాబును నమ్మితే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లే అని విమర్శించారు. సీఎం కేసిఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశాడన్నరు.

ప్రజల బాధలు తెలిసిన నాయకుడు జగన్ అని... రాజధాని ప్రాంత రైతులకు తప్పక న్యాయం చేస్తారన్నారు తలసాని. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి తిరుగుండదని అభిప్రాయపడ్డారు తలసాని.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.