రైతులారా బాబును నమ్మొద్దు... మీకు న్యాయం చేసేది జగనే : తలసాని

  • IndiaGlitz, [Thursday,January 16 2020]

ఏపీ రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఏలూరు లో కోడి పందేలను చూసేందుకు వెళ్ళిన ఆయన... గత ప్రభుత్వ పొరపాట్ల వల్లనే రాజధాని సమస్య తలెత్తిందని అభిప్రాయ పడ్డారు. రాజధాని విషయం పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినదని.... శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

రాజధాని రైతులు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం అన్న తలసాని.... సీఎం జగన్ తో చర్చిస్తే కచ్చితంగా న్యాయం చేస్తారన్నారు. ఇక మాజీ సీఎం చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు తలసాని. జోల పట్టుకుని భిక్షం ఎత్తే నేతలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. బాబును నమ్మితే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లే అని విమర్శించారు. సీఎం కేసిఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశాడన్నరు.

ప్రజల బాధలు తెలిసిన నాయకుడు జగన్ అని... రాజధాని ప్రాంత రైతులకు తప్పక న్యాయం చేస్తారన్నారు తలసాని. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి తిరుగుండదని అభిప్రాయపడ్డారు తలసాని.

More News

సామాజిక న్యాయం మాతోనే సాధ్యం : బీజేపీ - జనసేన

ఆంధ్ర ప్రదేశ్ కు బీజేపీ అవసరం చాలా ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విజయవాడ లో బీజేపీ జనసేన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... మనస్ఫూర్తిగా బీజేపీ తో పొత్తు తో

అప్పుడు మద్దతిచ్చి .. ఇప్పుడు తరలిస్తామంటే చూస్తూ ఊరుకొం : పవన్

సీఎం జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకు పడ్డారు జనసేనా అధినేత పవన్ కళ్యాణ్. అమరావతిని తరలించేందుకు వైసీపీ సర్కార్ ప్రయత్నిస్తోందని.... కానీ అది సాధ్యం కాదని స్పష్టం చేశారు.

నాన్ బాహుబలి 2 రికార్డ్స్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో !!!

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలయికలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురం లో సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ యాక్టింగ్, డాన్స్,

ర‌ష్మిక ఇంటిపై ఐటీ సోదాలు

ప్ర‌స్తుతం అగ్ర క‌థానాయిక‌గా టాలీవుడ్‌లో రాణిస్తున్న క‌న్న‌డ క‌థానాయ‌కి ర‌ష్మిక మంద‌న్న‌. ఈ సంక్రాంతికి స‌రిలేరు నీకెవ్వ‌రుతో మ‌రో సూప‌ర్‌హిట్ చిత్రాన్నిన త‌న ఖాతాలో వేసుకుంది.

‘యజమాని ఆజ్ఞాపిస్తేనే బీజేపీ చుట్టూ ప్యాకేజీ స్టార్’

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.