తండ్రీకొడుకులు.. భిన్న ఫ‌లితాలు

  • IndiaGlitz, [Tuesday,February 06 2018]

'మణిశర్మ' ఈ పేరు వింటే చెవుల్లో మెలోడీలు నాట్యమాడుతాయి. ఒకప్పుడు వ‌రుసబెట్టి ఇండస్ట్రీ హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ మెలోడీ బ్రహ్మకి గ‌త కొంత‌కాలంగా ఏదీ కలిసిరావడం లేదు. గత సంవత్సరం ఏకంగా 8 సినిమాలకు సంగీతాన్ని అందించినా.. వాటిలో ఒక్క‌టి కూడా సాలిడ్ హిట్ కాలేదు.

ఈ నేప‌థ్యంలో.. 2018లో 'టచ్ చేసి చూడు' సినిమాతో తొలిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫిబ్రవరి 2న విడుదలైన ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందించి తనదైన ముద్ర వేశారు మణిశర్మ. అయితే ఈ చిత్రం కూడా మణిశర్మ స్థాయికి త‌గ్గ విజ‌యాన్ని అందివ్వలేక‌పోయింది. అయితే, అదే రోజు విడుదలైన 'ఛలో' మూవీ మంచి హిట్ అయ్యింది. విశేష‌మేమిటంటే.. ఈ సినిమాకి స్వ‌రాలు అందించింది స్వ‌యానా మణిశర్మ తనయుడు మహతి స్వ‌ర సాగర్ కావ‌డం. తండ్రి బాటలోనే నడుస్తున్న ఈ తనయుడు.. ఛ‌లో కోసం మంచి మెలోడీలను అందించాడు.

ముఖ్యంగా చూసీ చూడంగానే పాట అయితే సినిమా విడుద‌ల‌కు ముందే పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు..సినిమా కూడా సూప‌ర్ హిట్ దిశ‌గా దూసుకుపోతోంది. మొత్త‌మ్మీద ఒకే రోజు తండ్రీకొడుకుల సినిమాలు విడుద‌ల కాగా.. వాటిలో తండ్రి సినిమా ప‌రాజ‌యాన్ని చ‌విచూడ‌గా.. త‌న‌యుడి సినిమా విజ‌యాన్ని అందుకుంద‌న్న‌మాట‌.

More News

అల్లు శిరీష్ విల‌న్ నాగ‌చైత‌న్య చిత్రంలోనూ..

సీనియర్ దర్శకులు దాసరి నారాయణరావు కుమారుడిగా తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టారు దాసరి అరుణ్ కుమార్. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాలు చేసినా...ఇవేవీ కూడా అరుణ్ కుమార్ కెరీర్‌కు ప్లస్ కాలేదు. ఆ తర్వాత చాలా కాలం సినిమాలకి దూరంగానే వున్నారు. తండ్రి మరణం తరువాత.. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ మళ్ళీ సినిమాల వైపు దృష్టి సారిస్

కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఇంటిలిజెంట్ అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది - లావణ్య త్రిపాఠి

సుప్రీం హీరో సాయిధరంతేజ్ హీరోగా సెన్సషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వవం లో సి కె ఎంటర్టైన్మెంట్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై

'రాజరథం' లో నిరూప్ అవంతికల రొమాంటిక్ చలి పోరాటం

ఇటీవల విడుదలైన 'రాజరథం' లోని రెండు పాటలు 'కాలేజ్ డేస్','నీలి మేఘమా' ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాబట్టుకున్నాయి.

దర్శకుడిగా మరో యంగ్ హీరో

ప్రతిభావంతుడైన దర్శకుడు..సినిమాకి సంబంధించిన అన్ని విభాగాల్లోనూ తనదైన ముద్ర వేస్తాడు.

'భరత్ అనే నేను' ... షూటింగ్ అప్ డేట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'భరత్ అనే నేను'.